కాంగ్రెస్ కు ఓటు వేస్తే దుష్టపాలన వస్తుంది..: కేటీఆర్

తెలంగాణ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఎల్బీనగర్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన రాష్ట్రంలోని ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ కు ఓటేస్తే ఆరు నెలలకో సీఎం రావడం ఖాయమని మంత్రి కేటీఆర్ అన్నారు.

కాంగ్రెస్ అంటే అంధకారం, కరెంట్ కోతలు మాత్రమేనని ఎద్దేవా చేశారు.ఈ క్రమంలో కాంగ్రెస్ కు ఓటు వేస్తే దుష్టపాలన వస్తుందని పేర్కొన్నారు.

కర్ణాటకలో ఐదు గంటలు కూడా విద్యుత్ ఇవ్వడం లేదన్న కేటీఆర్ తప్పు చేశామని కర్ణాటక రైతులు బాధపడుతున్నారని తెలిపారు.

అదేవిధంగా బీజేపీ ప్రస్తుతం రెండు సీట్లు కూడా గెలిచే పరిస్థితి లేదని విమర్శించారు.

మంచి చేసేది ఎవరో ఒకటికి రెండుసార్లు ఆలోచించి ప్రజలు ఓటు వేయాలని ఆయన కోరారు.

మురారి ఫ్లాప్ అని కామెంట్ చేసిన నెటిజన్.. కృష్ణవంశీ రియాక్షన్ కు షాకవ్వాల్సిందే!