ఈ పొడిని తీసుకుంటే ఎంత వేలాడే పొట్ట అయినా నెల రోజుల్లో మాయం!

ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పులు, గంటల తరబడి కూర్చుని ఉండడం, ప్రెగ్నెన్సీ, పలు రకాల మందుల వాడకం, మద్యపానం, కంటి నిండా నిద్ర లేకపోవడం తదితర కారణాల వల్ల నాజూగ్గా ఉండాల్సిన పొట్ట లావుగా తయారవుతుంది.

దాంతో పెరిగిన పొట్టను తగ్గించుకోవడం కోసం రకరకాల డైట్ లను ఫాలో అవుతుంటారు.

ఏవేవో చిట్కాలను ప్రయత్నిస్తుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.

? అయితే ఖ‌చ్చితంగా ఇప్పుడు చెప్పబోయే పొడిని మీ డైట్ లో చేర్చుకోవాల్సిందే.

ఈ పొడిని తీసుకోవడం వల్ల నెల రోజుల్లోనే వేలాడే పొట్ట మాయం అవుతుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఈ పొడిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల అవిసె గింజలు వేసి బాగా వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి.

అదే పాన్‌లో రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర, వ‌న్‌ టేబుల్ స్పూన్ సోంపు గింజలు వేసి వేయించుకుని తీసుకోవాలి.

మళ్లీ అదే పాన్ లో ఒక కప్పు కరివేపాకు వేసుకుని బాగా వేయించుకోవాలి.

ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించి పెట్టుకున్న కరివేపాకు, జీలకర్ర, సోంపు గింజలు, అవిసె గింజ‌లు, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, పావు టేబుల్ స్పూన్ ఇంగువ, పావు టేబుల్ స్పూన్ నల్ల ఉప్పు, పావు టేబుల్ స్పూన్ కరక్కాయ పొడి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

"""/" / ఇలా గ్రౌండ్‌ చేసుకున్న పొడిని గాలి చొరబడని ఒక డబ్బాలో నింపుకొని నిల్వ చేసుకోవాలి.

భోజనం చేసేటప్పుడు మొదటి ముద్దలో వ‌న్ టేబుల్ స్పూన్ ఈ పొడిని వేసుకుని కలిపి తినాలి.

ప్రతిరోజు ఈ పొడిని తీసుకుంటే పొట్ట వ‌ద్ద పేరుకుపోయిన కొవ్వు మొత్తం కరిగి పోతుంది.

దాంతో నెల రోజుల్లోనే మీ వేలాడే పొట్ట మాయమవడం ప్రారంభమవుతుంది.

రేపే నామినేషన్‎కి ఆఖరి రోజు.. ఖమ్మం ఎంపీ స్థానంపై సర్వత్రా ఉత్కంఠ