ఈ ఒక్కటి తీసుకుంటే శరీరంలోని పూర్తి రోగాలు మాయం..
TeluguStop.com
వాము ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆయుర్వేద నిపుణులుచెబుతున్నారు.ఇది కడుపు నొప్పి, గ్యాస్, అజీర్ణం వంటి అనేక రకాల కడుపు సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.
పూర్వకాలం మన పెద్దవారు పాటించిన ఆయుర్వేద వైద్యంలో కూడా వామును ఎక్కువగా ఉపయోగించేవారు.
ఇంకా చెప్పాలంటే ఆయుర్వేద నిపుణుల ప్రకారం ఇది కడుపులోనీ జీర్ణ వ్యవస్థ మెరుగుపరచడంలో, అతిసారం ఇంకా అలాగే మలబద్దకానికి చికిత్స చేయడంలో చాలా ప్రభావంతంగా పనిచేస్తుంది.
"""/"/ వాము జీర్ణశక్తికి చాలా మంచిది.ఇది చూడడానికి జీలకర్రలా అనిపించిన వాము గింజలు జీలకర్ర కంటే పరిమాణంలో కాస్త చిన్నదిగా ఉంటుంది.
రుచి కొంచెం ఘాటుగా అలాగే కారంగా ఉంటుంది.ఇది రూపంలో చిన్నదైనా ఇది చేసే మేలు మాత్రం చాలా పెద్దది.
ఇక వామును తినడం వల్ల మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వామును రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని కొద్దిగా తేనె వేసుకుని తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి.
"""/"/
అంతేకాకుండా శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారు వాము టీ తాగడం ఎంతో మంచిది.
అంతే కాకుండా వాము టీ తాగడం వల్ల క్యాన్సర్ వంటి భయంకర రోగాలు దగ్గరికి రావు.
అసిడిటీ జీర్ణ సమస్యలతో బాధపడేవారు వాము నీటిని తాగితే ఆ సమస్యలన్నీ దూరమవుతాయి.
ఇంకా వాము తినడం వల్ల మలబద్ధకం ఇంకా కడుపు నొప్పి తగ్గుతాయి.అలాగే గర్భిణి, బాలింతలకు కూడా వాము మేలు చేస్తుంది.
కీళ్ల నొప్పులను తగ్గించడంలో కూడా వాము మంచి పాత్ర పోషిస్తుంది.ఇంకా చెప్పాలంటే వాము నూనెను కీళ్లకు మసాజ్ చేసుకోవచ్చు.
ఇలా చేయడం వల్ల నొప్పుల నుంచి కాస్త ఉపశమనం కలుగుతుంది.అంతేకాకుండా వాము శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
ఇంకా అలాగే తలనొప్పి, మైగ్రేన్, అలసట కూడా తగ్గిస్తుంది.వాములో అనేక విటమిన్లు ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
ఎన్టీఆర్ ప్రశాంత్ మూవీలో ఆ మలయాళ నటుడు.. ప్రశాంత్ నీల్ ప్లాన్ వేరే లెవెల్!