ప్రపంచంలోని ఈ ఆసక్తికరమైన విషయాలు తెలిస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి!

ప్రకృతి సృష్టించిన ఈ ప్రపంచంలో ఎన్నో ఆసక్తికరమైన అశాలున్నాయి.ఇప్పుడు అలాంటి ఆసక్తికరమైన వాస్తవాల గురించి తెలుసుకుందాం.

ఇవి విన్న తరువాత మీరు మనసులో అవునా.నిజమా అని తప్పక అనుకుంటారు.

ప్రపంచంలో సముద్రం.ఎడారి కలిసి కలిసే ప్రదేశం ఒకటుంది.

అదే నమీబియా పశ్చిమ తీరం.ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ఎడారిగా పేరొందింది.

ఇది 50 మిలియన్ సంవత్సరాల క్రితం నాటిది.విశేషమేమిటంటే ఇక్కడ కనిపించే ఇసుక తిన్నెలు ప్రపంచంలోనే అతిపెద్దవిగా పేరుగాంచాయి.

భారతదేశంలోని మహారాష్ట్రలో ఆ రాష్ట్ర పక్షి హరియాల్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు.ఇది ఎప్పుడూ భూమిపై కాలు పెట్టదు.

ఈ పక్షులకు పొడవైన చెట్లతో ఉండే అడవులు అంటే ఇష్టం.ఇవి మర్రి చెట్లపై గూడు కట్టుకుంటాయి.

చాలా హరియాల్ పక్షులు గంపులుగా మాత్రమే కనిపిస్తాయి.ప్రపంచ వ్యాప్తంగా తాగునీటి కొరత గురించి మనందరికీ తెలుసు.

అయితే ప్రపంచంలోనే అత్యధికంగా తాగునీరు ఉన్న దేశం ఉందని మీకు తెలుసా? ఆ దేశం పేరు బ్రెజిల్.

బ్రెజిల్ అత్యధిక పునరుత్పాదక నీటి వనరులను కలిగి ఉంది.మొత్తం 8,233 క్యూబిక్ కిలోమీటర్ల నీటివనరులు ఇక్కడ ఉన్నాయి.

అది భారతదేశంలో అత్యంత పరిశుభ్రమైన నది.మేఘాలయలోని మావ్లిన్నాంగ్ గ్రామంలో 'ఉమాంగోట్ నది' ప్రవహిస్తుంది.

ఈ నదిలో చెత్త వేస్తే 5000 రూపాయల వరకు జరిమానా విధిస్తారు.

గ్యాస్ వినియోగదారులకు అలర్ట్..ఈ-కేవైసీ పూర్తి చేయకుంటే సబ్సిడీ కట్..!