వారం రోజులు ఈ రెమెడీని పాటిస్తే ముఖం అద్దంలా మెరుస్తుంది!
TeluguStop.com
ముఖం అద్దం మాదిరి మిల మిలా మెరుస్తూ ఉండాలని అందరూ కోరుకుంటారు.అందుకోసమే ఖరీదైన ఫేస్ క్రీములు, సీరమ్స్, ఫేస్ మాస్క్లు యూస్ చేస్తుంటారు.
తరచూ బ్యూటీ పార్లర్కి వెళ్లి ఫేషియల్స్ చేయించుకుంటారు.అందులోనూ ఏదైనా ఫంక్షన్కో, పెళ్లికో వెళ్లాల్సి వస్తే.
స్కిన్ పై మరింత శ్రద్ధ పెడుతుంటారు.అయితే మార్కెట్లో లభ్యమయ్యే చర్మ ఉత్పత్తుల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుందో తెలియదు గానీ.
ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ రెమెడీని వారం రోజులు పాటిస్తే ముఖం అద్దంలా మెరవడం ఖాయం.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండీ.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని గ్లాస్ వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో మూడు టేబుల్ స్పూన్లు కడిగిన బియ్యం వేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించాలి.
ఆపై స్ట్రైనర్ సాయంతో రైస్ వాటర్ను సపరేట్ చేసుకోవాలి.ఈ రైస్ వాటర్ కంప్లీట్ గా కూల్ అయిన వెంటనే.
అందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, వన్ టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుని విస్కర్ సాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి.
"""/" /
చివరిగా అందులో రెండు టేబుల్ స్పూన్ల చందనం పొడి వేసి మళ్లీ కలుపుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఏదైనా బ్రష్ సాయంతో ముఖానికి ప్యాక్లా వేసుకోవాలి.ఇరవై నిమిషాల అనంతరం తడి వేళ్లతో చర్మాన్ని సున్నితంగా రబ్ చేసుకుంటూ.
వాటర్తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఆపై ఏదైనా మాయిశ్చరైజర్ను రాసుకోవాలి.
రోజుకు ఒకసారి ఈ ఫేస్ ప్యాక్ను వేసుకుంటే.చర్మం అద్దంలా మెరిసిపోతుంది.
అలాగే స్కిన్పై మచ్చలు ఏమైనా ఉన్నా.క్రమంగా దూరం అవుతాయి.
స్కిన్ టోన్ సైతం ఇంప్రూవ్ అవుతుంది.
యూఎస్ గ్రీన్ కార్డ్.. భారత సంతతి వైద్యులను పట్టించుకోండి : ఎన్ఆర్ఐ డాక్టర్ల సంఘం