జ్యేష్ఠ మాసంలో ఇలాంటి ఆహారాలు తింటే అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్లే..?
TeluguStop.com
పంచాంగం ప్రకారం జ్యేష్ఠ మాసం ఏడాదిలో మూడవ మాసం అని దాదాపు చాలామందికి తెలుసు.
ఈ ఏడాది జ్యేష్ఠ మాసం మే 20వ తేదీ నుంచి మొదలై ఈనెల 18వ తేదీన ముగుస్తుంది.
జ్యేష్ఠ మాసానికి సంబంధించిన అనేక నియమాలు గ్రంధాలలో ఉన్నాయి.వీటిని పాటిస్తే ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
పురాతన గ్రంథాలలో ఆహారానికి సంబంధించిన నియమాలు కూడా ఉన్నాయి.శాస్త్రాలలో భారతీయ సంప్రదాయంలో( Indian Tradition ) రుతువులను బట్టి తినవలసిన ఆహారాలు త్రాగవలసిన పానియాలా గురించి ఎన్నో నియమాలు ఉన్నాయి.
"""/" /
జ్యేష్ఠ మాసంలో మనం తినే ఆహారం ఎలా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చైత్ర మాసంలో బెల్లం( Jaggery ), వైశాఖ మాసంలో నూనె, జ్యేష్ఠ మాసంలో మిరపకాయలు( Chillies ), ఆషాడ మాసంలో పప్పులు, శ్రావణమాసంలో పచ్చిమిర్చి, భాద్రపద మాసంలో పెరుగు తినాలని శాస్త్రాన్ని చెబుతున్నాయి.
కార్తీక మాసం, పుష్య మాసంలో ధనియాలు, మాఘమాసంలో పంచదార, ఫాల్గుణ మాసంలో పప్పు దినుసులు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో హానికరం అని కూడా శాస్త్రాలలో ఉంది.
"""/" /
అందుకే ఆచారాలను అనుసరించి ఆహారం తీసుకోవాలని శాస్త్రాలలో స్పష్టంగా వివరించారు.
కాలానికి అనుగుణంగా ఆహారం తీసుకోవడం వల్ల శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంతోపాటు ప్రమాదకరమైన వ్యాధుల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు.
జ్యేష్ఠ మాసంలో తినవలసిన ఆహారాలు త్రాగవలసిన పానీయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఎందుకంటే ఈ సమయంలో ఏదైనా తినడం, త్రాగడం ఆరోగ్యానికి చాలా ప్రమాదం అని ప్రజలు నమ్ముతారు.
అందుకే ఈ మాసంలో ముఖ్యంగా నూనె, మసాలాలతో తయారుచేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండటమే మంచిది.
ఇంకా చెప్పాలంటే జ్యేష్ఠ మాసంలో రోజుకి ఒక్కసారి మాత్రమే భోజనం చేయడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉండవచ్చని పురాతన గ్రంథాలలో ఉంది.
అలాగే ఈ మాసంలో పెరుగు, లస్సి, పండ్ల రసాలను ఎక్కువగా తీసుకుంటూ ఉండడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.
బ్యాటిల్ గ్రౌండ్లోకి ఇండో అమెరికన్లు.. కమలా హారిస్ కోసం భారీ క్యాంపెయినింగ్