ఇంట్లో ఈ వస్తువులను వాస్తు ప్రకారం.. అలంకరిస్తే ఆర్థిక సమస్యలన్నీ దూరం..!

ముఖ్యంగా చెప్పాలంటే వాస్తు అనేది చాలామంది ప్రజల జీవితాలపై ఎంతో ప్రభావం చూపుతుంది.

మీరు నివసించే ఇంట్లో వాస్తు సరిగ్గా లేకపోతే ఆ ఇంట్లో సంతోషం ఉండదు.

అలాగే ఆర్థికంగా, మానసికంగా ఆరోగ్యం పరంగా ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.ప్రధానంగా ఆ ఇంట్లో డబ్బు అసలు నిలవకుండా ఉంటుంది.

పేదరికం వెంటాడుతూ ఉంటుంది.అలాగే వాస్తు దోషం( Vastu Dosha ) ఉన్న ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ నిండి ఉంటుంది.

కానీ ఇంటి నుంచి ప్రతికూల శక్తిని తొలగించడంలో సహాయపడే కొన్ని వస్తువులు ఉన్నాయి.

ఆ వస్తువులను కొనీ ఇంట్లో ఉంచుకుంటే పాజిటివ్ ఎనర్జీ పెరిగి లక్ష్మీదేవి( Goddess Lakshmi ) ఆ ఇంటికి ఐశ్వర్యాన్ని ఇస్తుంది.

"""/" / వాస్తు ప్రకారం ఇంట్లో ఏ వస్తువులు ఉంటే ఐశ్వర్యం పెరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే వాస్తు ప్రకారం వలంపురి శంఖం( Valampuri Conch ) లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది.

ఈ శంఖాన్ని కొనీ బుధవారాలలో ఇంట్లో డబ్బు పెట్టే లో ఉంచాలి.దీనివల్ల ఇంటి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది.

జీవితంలో ఆనందం పెరుగుతుంది.లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఆ ఇంటిపై ఉంటుంది.

ఇంకా చెప్పాలంటే గుర్రపు డెక్కను ఇంట్లో ఉంచడం వల్ల ప్రతికూల శక్తి ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోతుంది.

అలాగే ఈ గుర్రపు డెక్కను నగదు లాకర్ లో ఉంచవచ్చు.అలాగే ఇంట్లో నవ్వుతున్న బుద్ధుడు ఉండడం కూడా మంచిదని నిపుణులు చెబుతున్నారు.

"""/" / దీన్ని ఈశాన్య దిశలో( North-east Direction ) ఉంచడం శుభప్రదంగా పరిగణిస్తారు.

ఇలా ఉంచడం వల్ల ఇంట్లో ఐశ్వర్యనికి, ధాన్యానికి అసలు లోటు ఉండదు.ఈ నవ్వుతున్న బుద్ధుడిని ఎవరైకైన బహుమతిగా ఇవ్వవచ్చు.

అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఇత్తడి లేదా తెల్ల ఏనుగు ఉంటే మంచిది.

హిందూమతంలో ఏనుగును వినాయకుడిగా పూజిస్తారు.ఏనుగు కూడా శ్రేయస్సు యొక్క చిహ్నంగా పరిగణిస్తారు.

కాబట్టి మీ ఇంట్లో సంపద పెరగాలంటే లోహపు ఏనుగు విగ్రహాన్ని తెచ్చి ఇంట్లో ఉంచడం మంచిది.

అంతేకాకుండా లోహపు తాబేలను ఇంట్లో ఉంచడం కూడా ఎంతో మంచిది.ఇలా ఉంచడం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వచ్చి సంపద పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఒక్క బొట్టు కూడా కింద పడకుండా నూనెని ఇలా బాటిల్లో నింపండి!