స్నానం చేసే నీటిలో వీటిని కలుపుకుంటే అదృష్టం మీ వెంటే..
TeluguStop.com
కొందరు మత విశ్వాసుల కు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు.జ్యోతిష్య శాస్త్రం, వాస్తు శాస్త్రాన్ని చాలా మంది ప్రజలు నమ్ముతారు.
ఆరోగ్యం, వృత్తి, సంపద, కుటుంబ క్షేమం కోసం పూజలు యజ్ఞలు కూడా చేస్తూ ఉంటారు.
అదృష్టం ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.డబ్బు, విజయం, కీర్తి సాధించడంలో మరింత సహాయపడే అదృష్టాన్ని పొందడం కోసం ఎక్కువ మంది జ్యోతిష్యన్ని నమ్ముతుంటారు.
చేతికి ఉంగరాలు ధరించడం, బ్యాగుల్లో అదృష్టం తీసుకొచ్చే వస్తువులను పెట్టుకుంటూ ఉంటారు.అంతే కాకుండా ఇప్పుడు మీరు స్నానం చేసేటప్పుడు వీటిని నీళ్లలో కలుపుకుంటే అదృష్టం మీ వెంటే అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
ముఖ్యంగా చెప్పాలంటే భారతీయులు వంటకాల్లో ఉపయోగించే అత్యంత సాధారణమైన పదార్థం పసుపు.భగవంతుడిని ఆరాధించడం దగ్గర నుంచి జలుబు తగ్గించే వరకు అన్ని విధాలుగా పసుపు ఉపయోగపడుతుంది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం స్నానం చేసే నీటిలో పసుపుని కలపడం వల్ల అదృష్టం, శ్రేయస్సు లభిస్తాయని చాలామంది ప్రజలు నమ్ముతారు.
"""/" /
పసుపులో శుద్ధి చేసే లక్షణాలు కూడా ఉన్నాయి.శరీరం నుంచి ప్రతికూల శక్తులను తొలగిస్తుందని కూడా చాలామంది చెబుతారు.
ఇంకా చెప్పాలంటే గంధం నూనె లేదా గంధపు పొడిని స్నానం చేసే నీటిలో కలపడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది.
ఒత్తిడిని తగ్గిస్తుంది.సానుకూలతను పెంచుతుంది.
ఒంటికి చలువ చేస్తుందని చాలామంది ప్రజలు నమ్ముతారు.ఇంకా చెప్పాలంటే గులాబీ రేకులు అద్భుతమైన సువాసన ను కలిగి ఉంటాయి.
"""/" /
చర్మ సంరక్షణ ప్రయోజనాల కోసం ఎన్నో దశాబ్దాలుగా గులాబీ రేకులను ఉపయోగిస్తూ వస్తున్నారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గులాబీ రేకులు ప్రేమ, ఆనందం, విజయాన్ని ఇస్తాయని చాలా మంది ప్రజలు నమ్ముతారు.
స్నానం చేసే నీటిలో గులాబీ రేకులను వేసి స్నానం చేయడం వల్ల ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది.
నల్గొండ – ఖమ్మం – వరంగల్ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి ప్రకటన