నేడు జరిగే క్వాలిఫైయర్ మ్యాచ్ రద్దయితే.. చెన్నై ను ఢీకొట్టే జట్టు ఏదంటే..?

ఈ ఐపీఎల్ ( IPL )లో మరికొన్ని గంటల్లో క్వాలిఫైయర్-2( Qualifier-2 ) మ్యాచ్ జరుగునున్న సంగతి తెలిసిందే.

క్వాలిఫైయర్-1 లో ఓడిన గుజరాత్.ఎలిమినేటర్ మ్యాచ్లో గెలిచిన ముంబై ( Mumbai Indians )మధ్య గెలిచిన జట్టు ఫైనల్ కు వెళుతుంది.

ఓడిన జట్టు ఇంటి ముఖం పడుతుంది.కాబట్టి రెండు జట్లు గెలుపు కోసం తీవ్రంగా పోరాడతాయి.

"""/" / కానీ క్రికెట్ అభిమానులకు వర్షం కారణంగా నేడు జరిగే మ్యాచ్ రద్దు అయితే ఏంటి పరిస్థితి అనే ఆలోచన దాదాపుగా వచ్చే ఉంటుంది.

ఒకవేళ మ్యాచ్ రద్దు అయితే ఫైనల్ లో చెన్నై తో ఏ జట్టు పోటీ పడుతుంది అనే సందేహాలు అందరిలో ఉండే ఉంటుంది.

ఇటువంటి సమయాలలో బీసీసీఐ ( BCCI )ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది.ఎలా సమస్యను పరిష్కరిస్తుంది అనే విషయాలు చూద్దాం.

బీసీసీఐ నియమాల ప్రకారం.లీగ్ దశలో ఉండే మ్యాచులు వర్షం లేక ఇతర కారణాల వల్ల రద్దు అయితే రెండు జట్లకు చెరోక పాయింట్ ఇస్తారు.

ఈ సీజన్లో చెన్నై- లక్నో మధ్య జరిగిన మ్యాచ్ రద్దు అయితే ఇరుజట్లకు చెరో పాయింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

"""/" / ప్లే ఆఫ్ దశలో ఉండే మ్యాచులు రద్దు అయితే నిబంధనల ప్రకారం గుజరాత్ జట్టు ఫైనల్ కు వెళ్ళి చెన్నై( CSK Vs GT ) జట్టుతో టైటిల్ కోసం పోటీ పడుతుంది.

ముంబై జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.అది ఎలా అంటే వర్షం కారణంగా ప్లే ఆఫ్ మ్యాచ్ రద్దు అయితే లీగ్ పాయింట్ల పట్టికలో ఎక్కువ పాయింట్లు సాధించిన జట్టు నేరుగా ఫైనల్ కు చేరుతుంది.

ఈ సీజన్లో గుజరాత్ పది మ్యాచ్లు గెలిచి 20 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.

మరి ముంబై జట్టు 14 మ్యాచ్లలో 8 మ్యాచులు గెలిచి 16 పాయింట్లు సాధించింది.

కాబట్టి వర్షం పడితే ముంబై జట్టు ఇంటికి.గుజరాత్ జట్టు ఫైనల్ కు వెళుతుంది.

రూ.82,000 జీతం కూడా చాలకపోతే.. మధ్య తరగతి బతుకు ఎలా గడవాలి.. ఈయన ఆవేదన ప్రతి ఒక్కరిదీ!