మలినాలు తొలగిపోయి బాడీ క్లీన్ గా హెల్తీ గా మారాలంటే తప్పకుండా రోజు ఇలా చేయండి!
TeluguStop.com
శరీరంలో మలినాలు పేరుకుపోయే కొద్ది ఆరోగ్యం క్రమంగా దెబ్బతింటుంది.వివిధ రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే అవకాశాలు పెరిగిపోతాయి.
అందుకే ఎప్పటికప్పుడు బాడీని డీటాక్స్ చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు.బాడీని డిటాక్స్ చేసుకోవడం అంటే పెద్దగా శ్రమించాల్సిన పనిలేదు.
ఇప్పుడు చెప్పబోయే సూపర్ పవర్ ఫుల్ డ్రింక్ ను ప్రతిరోజు ఉదయాన్నే తీసుకుంటే శరీరంలో పేరుకుపోయిన మలినాలన్నీ తొలగిపోతాయి.
బాడీ క్లీన్ గా మరియు హెల్తీ గా మారుతుంది.మరి ఇంతకీ ఈ డ్రింక్ ఏంటి.
దాన్ని ఎలా తయారు చేసుకోవాలి.అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక ఆరెంజ్ పండును తీసుకుని ఉప్పు నీటిలో శుభ్రంగా కడిగి తొక్క తీయకుండా స్లైసెస్ గా కట్ చేసుకోవాలి.
ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోయాలి.
వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో పావు టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి, చిటికెడు మిరియాల పొడి, అర అంగుళం పొట్టు తొలగించి దంచిన అల్లం ముక్క, నాలుగు ఆరెంజ్ స్లైసెస్, చిటికెడు పసుపు వేసుకొని ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు బాగా మరిగించాలి.
"""/"/
ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వాటర్ ను ఫిల్టర్ చేసుకుని గోరువెచ్చగా అయిన తర్వాత నేరుగా సేవించడమే.
ఈ డ్రింక్ లో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలతో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ మెండుగా ఉంటాయి.
రోజు ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ కు గంట ముందు ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన మలినాలు తొలగిపోతాయి.
శరీరం అంతర్గతంగా క్లీన్ అవుతుంది.బాడీ డీటాక్స్ అయితే ఆరోగ్యం అద్భుతంగా మెరుగుపడుతుంది.
"""/"/
అలాగే పైన చెప్పిన డ్రింక్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.
వెయిట్ లాస్ అవుతారు.క్యాన్సర్, మధుమేహం, గుండె పోటు వంటి ప్రాణాంతక జబ్బులు వచ్చే రిస్క్ సైతం తగ్గుముఖం పడుతుంది.
కాబట్టి ఈ హెల్తీ డ్రింక్ ను తప్పకుండా రోజు తీసుకునేందుకు ప్రయత్నించండి.ఆరోగ్యంగా జీవించండి.
బ్రిటీష్ గ్రాండ్ మాస్టర్గా భారత సంతతి బాలుడు.. ఎవరీ శ్రేయస్ రాయల్ ..?