సోనియా తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్ పరిస్థితి ఏంటి?: రేవంత్ రెడ్డి

ప్రజల ఆకాంక్షలు నెరవేరాలనే ఉద్దేశంతోనే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.

సోనియా తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.నిరుద్యోగులు బలవన్మరణాలకు పాల్పడుతుంటే ప్రభుత్వం నిందలు వేస్తోందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

రైతులను కేసీఆర్ నట్టేట ముంచారన్న రేవంత్ రెడ్డి హైదరాబాద్ చుట్టూ సుమారు పది వేల ఎకరాలు కబ్జా చేశారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.

బీఆర్ఎస్ పాలనలో రైతులకు గిట్టుబాటు ధర లేదన్నారు.రాహుల్ గాంధీని విమర్శించే అర్హత కేసీఆర్ కు లేదని తెలిపారు.

ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలను ప్రతి ఇంటికీ చేర్చాలని పిలుపునిచ్చారు.

కల్కి 2 తర్వాత నాగ్ అశ్విన్ ఆ స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నాడా..?