128 ఏళ్ల క్రితం చనిపోతే ఇప్పుడు అంత్యక్రియలు.. ఈ మమ్మీ స్టోరీ తెలిస్తే..!
TeluguStop.com
అది 128 ఏళ్ల క్రితం నాటి సంగతి.ఆ సమయంలో అమెరికా దేశం, పెన్సిల్వేనియా ( Pennsylvania )రాష్ట్రంలోని ఓ జైలులో ఓ దొంగ శిక్షను అనుభవిస్తున్నాడు.
అతనికి కిడ్నీ వైఫల్యం వచ్చి, 1895 నవంబర్ 19న చనిపోయాడు.అతడి మృతదేహాన్ని బంధువులకు అప్పజెప్పడానికి జైలు అధికారులు ప్రయత్నించారు, కానీ అతను నకిలీ పేరు చెప్పినట్లు తెలిసింది.
అతడి కుటుంబాన్ని కనుగొనడంలో పోలీసులు విఫలమయ్యారు.మృతదేహం కుళ్లిపోకుండా ఉండేందుకు, ఫ్యూనరల్ హోమ్లో పనిచేసే వ్యక్తులు దానిని మమ్మీగా మార్చారు.
"""/" /
ఈ మమ్మీని "స్టోన్మ్యాన్ విల్లీ"( Stoneman Willie ) అని పిలుస్తారు.
ఇది ఇప్పుడు స్మాల్ సిటీ రీడింగ్లోని ఓ మ్యూజియంలో ప్రదర్శించబడుతోంది.ఇప్పుడు, ఈ మమ్మీకి శాశ్వత విశ్రాంతిని ఇవ్వడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
చివరి సారి మమ్మీ ఎలా ఉంటుందో చూడాలనే ఆసక్తితో పర్యాటకులు, స్థానికులు మ్యూజియంకు తరలివెళ్తున్నారు.
మమ్మీ రూపంలో ఉన్న వ్యక్తి దొంగతనం కేసులో జైల్లోకి వచ్చినా, అతను నిజంగా చాలా మంచి వ్యక్తి అని ఫ్యూనరల్ హోమ్ యజమాని చెబుతున్నాడు.
"""/" /
ఈ మమ్మీ బాగా సంరక్షించబడింది, ఇప్పటికీ అది నిజమైన వ్యక్తిలా కనిపిస్తుంది.
ఇది బట్టలు ధరించి ఉంది.మమ్మీలకు జుట్టు, దంతాలు ఊడిపోతాయి కానీ ఈ దొంగ యొక్క మమ్మీ జుట్టు, దంతాలు ఊడిపోలేదు.
100 సంవత్సరాల తర్వాత ఫ్యూనరల్ హోమ్ చివరకు మమ్మీ ఐడెంటిటీ గుర్తించింది.దీని కోసం వారు పురాతన పత్రాలు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు.
అలా సదరు దొంగ ఐర్లాండ్ దేశానికి చెందినవాడని తెలుసుకున్నారు.ఈ శనివారం అంటే అక్టోబర్ 7న స్టోన్మ్యాన్ విల్లీ మమ్మీని రీడింగ్ వీధుల్లో ఖననం చేయనున్నారు.
అంత్యక్రియల తర్వాత, ఫ్యూనరల్ హోమ్ స్టోన్మ్యాన్ విల్లీ యొక్క నిజమైన వివరాలను అతని సమాధిపై రాయనుంది.
అలా గౌరవంగా ఈ దొంగ ఆత్మకు శాంతి చేకూర్చాలని ఫ్యూనరల్ హోమ్ నిర్ణయించింది.
పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటన ఖరారు..!!