గర్భిణీలు ఈ ఆహార పదార్థాలు తింటే పుట్టబోయే బిడ్డ కు ప్రమాదమా..

గర్భంతో ఉన్న ఆడవారు అనేక రకాలైన ఆహార పదార్థాలను తింటూ ఉంటారు.ఎందుకు అంటే గర్భంతో ఉన్న ఆడవారికి ఎక్కువగా ఆకలి వేస్తూ ఉంటుంది.

కొందరిలో మాత్రం ఏమి తిన్నా వికారంగా అనిపిస్తూ వాంతులు చేసుకుంటూ ఉంటారు.గర్భిణీల నోటికి ఇష్టం అనిపించింది తినాలని పెద్దలు చెబుతూ ఉంటారు.

కానీ గర్భిణీలు కొన్ని రకాల తినుబండారాలను తినడం అంత మంచిది కాదు.వాటిని తినడం వల్ల పుట్టబోయే బిడ్డపై చెడు ప్రభావం చూపే అవకాశం ఉంది.

చిప్స్ మరియు కురుకురే వంటి జంక్ ఫుడ్స్ గర్భిణులకు ప్రమాదం అని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఆలూ చిప్స్ ను తయారు చేసే సమయంలో అత్యంత వేడైన నూనెలో వేడి ఫ్రై చేస్తారు.

ఆ తర్వాత టెస్టింగ్ సోడాను వాటిపై చల్లుతారు.అలా చల్లే టెస్టింగ్ సోడా కూడా రసాయనంలో తయారవుతుంది.

కాబట్టి ఈ పదార్థాలు గర్భిణి మహిళలకు అంత మంచిది కాదు.ఇంకా చెప్పాలంటే అత్యధికంగా నూనె వస్తువులు తినడం వల్ల పుట్టబోయే బిడ్డ సన్నగా పుట్టడం మాత్రమే కాకుండా పుట్టిన తర్వాత కూడా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటాడని వైద్య నిపుణులు చెబుతున్నారు.

"""/"/ చిన్న పిల్లలను జంక్ ఫుడ్స్ తినవద్దంటూ వైద్యులు హెచ్చరిస్తూ ఉంటారు.అలాంటప్పుడు చిన్న పాపాయిని కడుపులో మోస్తున్న తల్లి ఎలా జంక్ ఫుడ్ తింటుంది అని వైద్యులు చెబుతున్నారు.

జంక్ ఫుడ్ గర్భంతో ఉన్న సమయంలో తినడం వల్ల అది పిల్లాడు పుట్టిన తర్వాత కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది.

అందుకే ఆయిల్ ఫుడ్ ను తక్కువ తినడం లేదా వీలైతే మానేయడమే మంచిది.

అంతేకాకుండా చిప్స్ మరియు ఆయిల్ స్నాక్స్ ను పూర్తిగా మానేయాలి. """/"/ గర్భంతో ఉన్నవారు వాటిని అధికంగా తినకూడదని వైద్యులు చెబుతున్నారు.

గర్భిణీలు ఆహారం ఒకేసారి తినకూడదు.మూడుసార్లు తినే ఆహారం ఐదు లేదా ఆరుసార్లు తినడం కూడా మంచిదే.

అలా తింటూ ఉన్న ఆహారం వెంటనే జీర్ణం అవుతూ ఉంటుంది.ఒకేసారి ఎక్కువగా తినడం వల్ల గర్భిణీలు ఆయాసంతో నడవలేకపోయే పరిస్థితి వచ్చే అవకాశం ఉంది.

New Bank Charges: మే 1 నుంచి కొత్త రుసుములు వసూలు చేయనున్న దేశీయ బ్యాంకులు..