శని దేవుడు మనల్ని చల్లగా చూడాలంటే ఈ దేవుణ్ణి పూజించాల్సిందే..
TeluguStop.com
మనదేశంలో చాలామంది ప్రజలు ఎంతో భక్తితో ఆలయానికి వెళ్లి పూజలు చేస్తూ ఉంటారు.
ఎందుకంటే వారి కుటుంబ సభ్యులు బాగుండాలని కొందరు, వారి వృత్తి, వ్యాపారాలలో లాభాలు రావాలని భక్తితో పూజలు చేస్తూ ఉంటారు.
కానీ ఎంతోమందికి వ్యాపారాల్లో నష్టాలు వస్తుంటే వారి జీవితాల్లోకి శని దేవుడు వచ్చాడని నమ్ముతుంటారు.
అలా శని దేవుడు భక్తులను చల్లగా చూడాలంటే ప్రతి ఒక్కరు ఈ దేవుణ్ణి కచ్చితంగా పూజించాలి.
అలా తెలిసి తెలియక చేసే కొన్ని తప్పులు వల్ల శని దేవునీ ఆగ్రహానికి కారణమై కొన్ని రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు.
ఏ దేవుడిని పూజించడం వల్ల మీకు శని బాధలు తప్పి ఆ శని దేవుడు కూడా మిమ్మల్ని చల్లగా చూస్తాడు.
శనిదేవుని అనుగ్రహం మనపై ఉండాలని అనుకున్న వారు హనుమంతుడిని పూజిస్తే వారిపై తప్పకుండా శని దోషం నుంచి విముక్తి పొందుతారు.
అంతే కాకుండా హనుమంతుడిని భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల శని దేవుడు హనుమంతుని భక్తుల వైపు చూడడు.
అందుకోసం శనివారం రోజు హనుమాన్ చాలీసా అని పఠించడం ద్వారా మన పై శని ప్రభావం లేకుండా చేసుకోవచ్చు.
అదేవిధంగా పరమశివుని భక్తులని కూడా శని దేవుడు చల్లగా చూస్తాడు.పురాణాల ప్రకారం శివుడు శని దేవుడిని రావి చెట్టుకు వేలాడదీసి శిక్షించినందున శనికి రావిచెట్టు అంటే భయం అని చాలామంది శివుని భక్తుల నమ్మకం.
"""/" /
అందుకే శనివారం రోజు ఎవరైతే రావి చెట్టుకు పూజలు చేస్తారో అటువంటి వారి వైపు శని దేవుడు కన్నెత్తి చూడలేడు.
కాబట్టి ఎవరైతే శని దేవుడు కూడా చల్లగా చూడాలి అటువంటివారు ఆంజనేయ స్వామిని పూజించడం చాలా మంచిది.
అదే విధంగా పరమశివుని పూజించడం కూడా ఎంతో ఎంతో మంచిదని చాలామంది ప్రజలు నమ్మకంతో ఉంటారు.
అంతేకాకుండా శని దేవునికి ఎంతో భయమైన రావి చెట్టును పూజించడం వల్ల శని దేవుని నుంచి హనుమంతుని, పరమశివుని భక్తులపై శని దేవుని చెడు ప్రభావం ఉండదు.