నాకు మంత్రి పదవి ఇస్తే పార్టీకి,ప్రజలకే లాభం:రాజగోపాల్ రెడ్డి

నల్లగొండ జిల్లా:తనకు మంత్రి పదవి వస్తే కాంగ్రెస్ పార్టీకి,ప్రజలకే లాభమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.

బడ్జెట్ సమావేశాల తర్వాత క్యాబినెట్ విస్తరణ ఉండొచ్చని తెలిపారు.'నిద్రాహారాలు మాని భువనగిరి ఎంపీ సీటును గెలిపించాను.

2018లో నేను కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తే బీజేపీకి,ఆ తర్వాత బీజేపీ నుంచి బరిలో ఉంటే కాంగ్రెస్ కు డిపాజిట్ రాలేదు.

2023 లోనూ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే బీజేపీకి డిపాజిట్ దక్కలేదని పేర్కొన్నారు.

సుదీక్ష కోణంకి అదృశ్యం కేసులో పురోగతి.. బీచ్ వద్ద కనిపించిన దుస్తులు