కాంగ్రెస్ గెలిస్తే ఈ ఏడుగురిలో ఎవరు సీఎం అవుతారంటే..?

గత కొన్ని నెలల నుంచి తెలంగాణ ( Telangana ) రాష్ట్రంలో ఎన్నికల వేడి కొనసాగింది.

ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఎప్పుడైతే ఇచ్చిందో అప్పటినుంచి తెలంగాణలో పరిస్థితులు మారాయి.

ఓవైపు కాంగ్రెస్ మరోవైపు బిఆర్ఎస్ ఇంకోవైపు బిజెపి, బీఎస్పీ, సిపిఐ, సిపిఎం పార్టీలు వారి వారి అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల బరిలో నిలిచాయి.

ఈ సందర్భంలో కేవలం కాంగ్రెస్( Congress ) , బీఆర్ఎస్ మధ్యనే విపరీతమైనటువంటి పోటీ నెలకొన్నది.

ఈ విధంగా 119 నియోజకవర్గాల్లో ఆయా పార్టీల అభ్యర్థులు కొన్ని రోజుల నుంచి ప్రచారంలో మునిగిపోయి ఎంతో కష్టపడ్డారు.

ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు శతవిధాలా ప్రయత్నం చేశారు.చివరికి నవంబర్ 30వ ఎన్నికలు కూడా జరిగాయి.

మరి ఈ ఎన్నికల రిజల్ట్ 3వ తేదీన రానుంది.ఈ తరుణంలోనే వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అందరికీ ఆసక్తికరంగా మారాయి.

ఈ ఎగ్జిట్ పోల్స్ ( Exit Polls ) అన్ని సంస్థలు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నాయి.

ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేతలు మంచి జోష్ లో ఉన్నారు.ఈ సందర్భంలో కాంగ్రెస్ పూర్తిస్థాయి మెజారిటీ సాధిస్తే సీఎం ఎవరు అనేది చాలా ఆసక్తికరంగా మారింది.

ఇకపోతే కాంగ్రెస్ లో ఈ కీలకమైన లీడర్లు సీఎం రేసులో ఉన్నారు.వారెవరో ఇప్పుడు చూద్దాం.

"""/" / కాంగ్రెస్ మెజారిటీ సాధిస్తే మాత్రం సీఎం రేసులో ముందుగా ఉండేది రేవంత్ రెడ్డి( Revanth Reddy ) .

ఆ తర్వాత వరుసలో దళిత కోటాలో బట్టి విక్రమార్క ఉన్నారు.అంతేకాకుండా బీసీ కోటాలో పొన్నం ప్రభాకర్ గౌడ్, మధుయాష్కి గౌడ్ ఉన్నారు.

ఈ నలుగురు నేతలు కీలకంగా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ లో సీనియర్లుగా ఉన్నటువంటి జానారెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే సీఎం కూర్చిపై కన్నేసినట్టు తెలుస్తోంది.

"""/" / ప్రస్తుతం బిజెపి పార్టీ బీసీ నినాదంతో కొనసాగుతోంది.ఒకవేళ కాంగ్రెస్ కూడా బీసీని సీఎం చేయాలి అనుకుంటే మాత్రం పొన్నం ప్రభాకర్ ( Ponnam Prabhakar ) కి ఎక్కువగా అవకాశం ఉంది.

ఒకవేళ ఈ నినాదం లేకుంటే ఈ ఏడుగురు నేతల మధ్య విపరీతమైన పోటీ ఏర్పడే అవకాశం కనిపిస్తుంది.

మరి చూద్దాం రిజల్ట్ ఏ విధంగా వస్తుందో కొన్ని గంటల్లో తెలియనుంది.

త్వరలో అనంతపురంకి అండర్ గ్రౌండ్ డ్రైనేజీని తీసుకొస్తాం: ఎమ్మెల్యే దగ్గుబాటి