ఆ చెట్లకు కాసే పళ్లు అమ్మితే లక్షల్లో డబ్బు... వాటి కోసం హత్యలు చేసేందుకైనా వెనుకాడరు..

ఈ సువిశాల ప్రపంచంలో దేన్నీ తక్కువగా అంచనా వేయలేం.ఇక్కడ వేస్ట్ అయ్యేది అంటూ ఏదీ ఉండదు.

ప్రతి దానికి ఎంతో కొంత విలువ ఉండే ఉంటుంది.అలా ఓ చోట చెట్లకు కాసే పండ్లకు లక్షల్లో విలువ ఉండడం గురించి వార్త వైరల్ అవుతుంది.

ఇంతకీ అవేం పండ్లు అంటే.ఆఫ్రికా ఖండంలోని కెన్యా దేశంలో అవకాడో చెట్లకు పండే పండ్ల గురించి తెలిస్తే ఎవరైనా సరే నోరెళ్లబెట్టాల్సిందే.

ఈ ఒక్క చెట్టు నుంచి ఏడాదికి దాదాపు రూ.44,500 లాభం వస్తుందట.

అంతలా లాభం వస్తే ఎవరు ఊరుకుంటారు.కాబట్టి ఈ కాయలకు దొంగల బెడద కూడా ఎక్కువే.

దొంగల నుంచి ఈ కాయలను రక్షించుకునేందుకు అవకాడో రైతులు చేయని సాహసాలు అంటూ ఉండవు.

ఈ పంటలను రక్షించుకునేందుకు కొన్ని చోట్ల అవకాడో రక్షణ బృందాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు.

ఇలా అవకాడో చెట్లను రక్షించుకుంటేనే వాటి కాయలు సురక్షితంగా ఉంటాయని లేకపోతే దొంగలు ఈ కాయలను ఖచ్చితంగా ఎత్తుకుని పోతారని అక్కడి రైతులు చెబుతున్నారు.

"""/" / ఈ చేన్ల చుట్టూ రక్షణ కంచెలు ఏర్పాటు చేసినప్పటికీ ఆ కంచెలను తెంచుకుని మరీ దొంగలు అవకాడో కాయలను దొంగిలిస్తున్నారని అంటున్నారు.

కాబట్టే సాయంత్రం చీకటి పడ్డప్పటి నుంచి మరలా సూర్యోదయం వరకు అక్కడ ఈ చెట్లకు రక్షణగా కొన్ని బృందాలు గస్తీ కాస్తాయి.

ఈ బృందాలను అవకాడో బృందాలు అని అంటారు.ఇలా ఈ బృందాల చేతిలో పలుసార్లు దొంగలు హత్యలకు కూడా గురవుతుంటారు.

హత్యలు జరుగుతాయని తెలిసినా కూడా ఈ కాయలను దొంగిలించేందుకు దొంగలు వెనుకాడరు.ఇంకా విచిత్రమేంటంటే.

ఈ తోటలకు డ్రోన్లతో కూడా పహారాలు కాస్తూ ఉంటారు.ఈ విషయం తెలిసి చాలా మంది ఇదెక్కడి చోద్యం రా బాబు అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పుడైనా జగన్ ను విమర్శిస్తారా ? మోది టూర్ పై కూటమి నేతల ఆశలు