భీమ్లా నాయక్ పై మొదటిసారి స్పందించిన పుష్పరాజ్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'భీమ్లా నాయక్' గ్రాండ్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.

ఈ సినిమాలో పవన్ ను మాస్ అవతార్ లో చూసి పవర్ స్టార్ ఫ్యాన్స్ కూడా ఊగి పోతున్నారు.

చాలా రోజుల తర్వాత పవర్ స్టార్ రేంజ్ కు తగిన సినిమా పడడంతో ఆ రేంజ్ లో హిట్ అయ్యింది.

ఈ సినిమా రిలీజ్ అయినా అన్ని చోట్ల మంచి టాక్ తెచ్చుకుంది.ఇక ఈ సినిమా థియేటర్స్ లో దుమ్ము దులిపి ఇప్పుడు ఓటిటి లోకి కూడా నేటి నుండి అందుబాటులోకి వచ్చింది.

థియేటర్స్ లో సినిమా చూసిన వారు కూడా ఇప్పుడు మళ్ళీ ఒటిటి లో చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

ఇంట్లో ఫ్యామిలీతో కలిసి ఒటిటి లో సినిమా చూస్తూ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు.

ఫ్యాన్స్ ఎంజాయ్ మెంట్ లో లేట్ గా జాయిన్ అయిన అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా భీమ్లా పై మొదటిసారి స్పందించారు.

భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ తర్వాత థియేటర్ లో ఫ్యామిలీ తో సినిమా చూసినా ఆయన సోషల్ మీడియా వేదికగా మాత్రం స్పందించలేదు.

"""/"/ కానీ ఇప్పుడు ఓటిటి లో చూసిన తర్వాత స్పందించారు.ఈ సినిమా ఆహా ఓటిటి లో కూడా స్ట్రీమింగ్ అయ్యింది.

ఇందులో 4కే ఫార్మాట్, డాల్బీ 5.1 ఆడియోలో అందుబాటులో ఉంది.

దీంతో ఇంటి దగ్గరే ప్రేక్షకులు అద్భుతమైన సౌండ్ తో సినిమాను వీక్షిస్తున్నారు. """/"/ ఈ సినిమా చూసిన బన్నీ ట్వీట్ చేస్తూ.

''పార్టీకి లేట్ గా వచ్చాను.కానీ అద్భుతమైన బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పవన్ గారు, త్రివిక్రమ్, సాగర్ కే చంద్ర, థమన్ చిత్ర యూనిట్ మొత్తానికి బిగ్ కంగ్రాట్స్.

ఆహాలో హైయెస్ట్ క్వాలిటీ మూవీని ఎంజాయ్ చేయండి'' అంటూ పోస్ట్ చేయగా ఈయన ట్వీట్ వైరల్ అయ్యింది.

భారీస్థాయిలో బాలయ్య 50 ఏళ్ల సినిమా ప్రస్థాన వేడుకలు.. ఆ హీరోలు హాజరవుతారా?