కార్మిక భవన నిర్మాణం కోసం కృషి చేస్తా..ఒగ్గు బాలరాజు యాదవ్

కార్మిక భవన నిర్మాణం కోసం కృషి చేస్తా.మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలకేంద్రంలో కార్మికుల సంక్షేమ భవన్ నిర్మాణం కోసం కార్మిక భవన్ నిర్మించడానికి మంత్రి కెటిఆర్,జిల్లా బిఆర్ ఎస్ అధ్యక్షులు తోట ఆగయ్య, సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి సహకారం తో రెండు గుంటల విస్తీర్ణంలో కార్మిక భవన్ నిర్మాణం కోసం కృషి చేస్తానని ఎల్లారెడ్డిపేట మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ అన్నారు.

మండలకేంద్రము లో సిఐ టియు ఆధ్వర్యములో జరిగిన మే డే జెండా ఆవిష్కరణ కార్యక్రమం లో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జెందావిష్కరణ లో పాల్గొన్న కార్మికులకు మే డే శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర నాయకులు రేసు రాజయ్య,శామ్యూల్ తో పాటు గ్రామంచాయతీ, హమాలీ అనుబంధ సంఘాల కార్మికులు పాల్గొన్నారు.

కూతురి పెళ్లిరోజు ఈ తండ్రి ఎంత సాహసం చేశాడో తెలిస్తే..