మతతత్వ పార్టీకి మద్ధతు తెలపను..: వీహెచ్

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు( Hanumantha Rao కీలక వ్యాఖ్యలు చేశారు.

తనపై ఎవరో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.తాను మాట్లాడని విషయాలను మాట్లాడినట్లు రాశారని వీహెచ్ తెలిపారు.

ఈ క్రమంలో తనపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు.

ఎవరి భూములు తీసుకోలేదన్న వీహెచ్ డబ్బులు సంపాదించలేదని చెప్పారు.తనపై చేసిన తప్పుడు ప్రచారం వెనుక బీజేపీ, ఆర్ఎస్ఎస్ ( BJP, RSS )ఉన్నాయని ఆరోపించారు.

మతతత్వ పార్టీకి తాను ఎప్పుడూ మద్దతు తెలపలేదని పేర్కొన్నారు.కేసీఆర్( KCR ) పరేషాన్ లో ఉన్నారని, అందుకే ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు.

తెలంగాణలో కాంగ్రెస్ పదేళ్ల పాటు అధికారంలో ఉంటుందని తెలిపారు.

అలియా కూతురు విషయంలో నెరవేరిన ఎన్టీఆర్ కోరిక.. ఏం జరిగిందంటే?