ఇంకా అలాంటి పాత్రలలో నటించాలని ఉంది… మనసులో మాట చెప్పిన పూజ హెగ్డే!

తెలుగు చిత్ర పరిశ్రమలో బుట్ట బొమ్మగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న పూజ హెగ్డే ( Pooja Hedg E) ప్రస్తుతం ఇతర భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

దక్షిణాది రాష్ట్రాలలో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న ఈమె ఉత్తరాది రాష్ట్రాలలో అదే స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకోవడానికి కష్టపడుతున్నారు.

తాజాగా సల్మాన్ ఖాన్ ( Salman Khan ) సరసన నటించిన కీసి కా భాయ్.

కిసీ కీ జాన్ ( Kisi Ka Bhai.Kisi Ki Jaan ) అనే సినిమా ద్వారా ఈనెల 21వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. """/" / ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్న పూజా హెగ్డే తన వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తిపరమైన విషయాల గురించి కూడా వెల్లడిస్తున్నారు.

ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి పూజ మాట్లాడుతూ నేను కథలు చెప్పడానికి ఉన్నాను.

సినిమాలలోని పాటలు కూడా కథలు చెబుతాయి. """/" / అందుకే నాకు నచ్చినప్పుడు పాటలు కూడా చేస్తుంటానని తెలిపారు.

ఇక చిన్నప్పుడు డాన్స్ చేయాలంటే చాలా భయం వేసేది కానీ మా అమ్మ భరతనాట్యం నేర్చుకోమని చెప్పింది.

అప్పటినుంచి ఆస్వాదించడం నేర్చుకున్నానని ఆ క్షణమే ప్రత్యేక పాటలపై ఆసక్తి పెరిగిందని తెలిపారు.

"""/" / ఇక నటన గురించి మాట్లాడుతూ.ప్రతి భాషలోనూ ఓ ప్రత్యేకత ఉంటుంది.

తాను ఏ భాషలోనైనా నటించడాన్ని చాలా గౌరవంగా భావిస్తానని తెలిపారు.నటిగా ఇంకా నాకు చాలా టార్గెట్స్ ఉన్నాయి.

ఇదివరకు నటించిన పాత్రలు కాకుండా ఇంకా చాలా మంచి మంచి పాత్రలలో నటించాలని ఉంది.

ముఖ్యంగా మహిళలలో స్ఫూర్తిని నింపే పాత్రలలో నటించాలని ఉందని ఈ సందర్భంగా మనసులో ఉన్న కోరికను బయటపెట్టారు.

ప్రస్తుతం ఈమె మహేష్ బాబు ( Mahesh Babu ) హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో నటిస్తున్నారు.

మర్డర్ చేస్తానని అమెరికా అమ్మాయి వార్నింగ్.. వణికిపోయిన తనికెళ్ల భరణి.?