ఈ తప్పుడు నాకొడుకులకు నేను భయపడను.. శివాజీ రాజా కామెంట్స్ వైరల్?

నేను ఎవ్వరికీ భయపడను, ఎందుకంటే నేను తప్పు చేయను, ఒకరికి అన్యాయం చేయను అని అంటూ నటుడు శివాజీ రాజా పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు.

తప్పుడు నా కొడుకులు, తప్పు చేసే వాళ్లు భయపడాలి తప్పితే తనలాంటి నిజాయతీ కలిగిన వాళ్లు ఎందుకు భయపడాలంటూ ఆయన వ్యాఖ్యానించారు.

తాను అందరూ బాగుండాలని కోరుకుంటా, పై మాట ఎందుకు అన్నానంటే తప్పు చేసే వాళ్లు భయపడాలి గానీ, శివాజీ రాజీ అనే వ్యక్తి ఎందుకు భయపడాలి అంటూ ఆయన వివరించారు.

ఇకపోతే ఇండస్ట్రీలో ఇప్పటివరకూ తానెవరికీ భయపడలేదని, అసలు తనను భయపట్టే మగాళ్లు కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవరూ లేరని శివాజీ రాజా విశ్వాసం వ్యక్తం చేశారు.

ఎందుకంటే తాను తప్పు చేయను, షూటింగ్‌లకు లేటుగా వెళ్లను, ఇంకొకరి క్యారెక్టర్‌లు కొట్టేయను, ఇంకొకరి కాళ్లు లాగాలని చూడను, నా దగ్గరికొస్తే కరెక్టుగా చేస్తాను, లేదంటే కామ్‌గా కూర్చుంటాను అని ఆయన చెప్పారు.

ఈ మాట ఎందుకు అన్నానంటే ఇవి ఒకరికి తగలాలని, ఈ మాటలు నా గురించే అన్నారు అని ఒకరికి తెలియాలని అన్నట్టు ఆయన తెలిపారు.

కచ్చితంగా చెప్తే నీ లాంటి బొకడా గాళ్లను చాలా మంది చూశాన్రా నేను, బ్యాక్‌గ్రౌండ్‌లు తెలియకుండా మాట్లాడతావు నువ్వు, అని ఒకడికి తెలియాలి కాబట్టి అలా అన్నానని శివాజీ రాజా అన్నారు.

"""/"/ భయపడడానికి ఎవరి దగ్గరైనా అప్పులు చేసి, ఒక టైంకి ఇస్తానని చెప్పి ఇవ్వకపోతే నేను భయపడాలి.

కానీ నాకు అప్పంటే చాలా భయం అని ఆయన తెలిపారు.హీరో శ్రీకాంత్‌ కూడా నేను అప్పు చేయనని నా గురించి గర్వంగా చెప్తాడని శివాజీ రాజా అన్నారు.

ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే మాత్రం కచ్చితంగా భయపడతా అని ఆయన చెప్పారు.

"""/"/ ఇప్పుడే కాదు, తన దగ్గర పావలా లేనప్పుడు కూడా ఎవరికీ భయపడలేదని శివాజీ రాజా స్పష్టం చేశారు.

ముందు నుంచీ తాను ముక్కు సూటిగా మాట్లాడే అలవాటు ఉందన్న ఆయన, దాని వల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయని ఆయన అన్నారు.

తననెవరన్నా కాదు అని దూరం వెళ్లిపోయినా మళ్లీ వాళ్లే తన దగ్గరికి వచ్చి తనతో లైఫ్‌లాంగ్ ఉంటారని శివాజీ రాజా చెప్పారు.

ఇంతకు ముందు తాను చేసిన కామెంట్లు ఒక వ్యక్తి గురించి, కానీ అతని పేరు చెప్పమన్నా కూడా చెప్పనని, అయినా కూడా అతనికి తన గురించే ఆ కామెంట్లు చేశానని అర్థం అవుతుందని శివాజీ రాజా నవ్వుతూ చెప్పారు.

వాడు కూడా అది నన్నే అన్నాడు అని నవ్వుకుంటాడని ఆయన తెలిపారు.అంటే వెదవలు చాలా మంది ఉంటారని, అలాంటివాళ్లను దాటుకొస్తేనే ఓ స్థాయికి వస్తామని ఆయన అన్నారు.

35 ఏళ్లలో అలాంటి వాళ్లను చాలా మందిని చూశామని శివాజీ రాజా వివరించారు.

తనకన్నా సీనియర్స్‌ 40,50 ఏళ్లలో ఇంకెంత మందిని చూసి ఉంటారో కదా ఆయన చెప్పుకొచ్చారు.

నైట్‌కి నైటే స్టార్‌ అయిపోతారు కొంతమంది, అవన్నీ వేస్ట్ అన్న్ ఆయన ఇంకా చాలా చూడాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.

ఇది వేదాంతం కాదు గానీ, చాలా మంది వెదవలు ఎక్కడో కాదు, సగం మంది మన పక్కనే ఉంటారని శివాజీ రాజా అన్నారు.

ఇప్పుడు మనం ఓడిపోతే పక్కోడి దగ్గరికెళ్లి డ్యాన్సులు చేస్తారు కదా వాళ్లు వెదవలే అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

గుంటూరు ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..!!