నాకు చంపడం ఇష్టం లేదు... రష్మిక కామెంట్స్ వైరల్!

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో దూసుకెళ్తున్న కన్నడ బ్యూటీ రష్మిక మందన.

అతి తక్కువ సమయంలో టాలీవుడ్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.

పైగా ఇండియన్ క్రష్ గా కూడా పేరు సొంతం చేసుకుంది.ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ లో ఈ అమ్మడు రేంజ్ హై లో ఉంది.

తొలిసారిగా సినీ ఇండస్ట్రీకి 2016లో కన్నడ సినిమా కిరాక్ పార్టీ తో పరిచయమైంది.

ఆ తర్వాత ఛలో సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది.ఇక ఈ సినిమాతో తొలి నటనతో బాగానే మెప్పించింది.

ఆ తర్వాత అదే ఏడాది గీత గోవిందం సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది.

ఇక అలా పలు సినిమాలలో అవకాశాలు అందుకోగా అందులో సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పొగరు సినిమాలతో మంచి సక్సెస్ అందుకుంది.

ఇక ఇటీవలే పాన్ ఇండియా మూవీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో హీరోయిన్ గా నటించింది మంచి హిట్ సంపాదించుకుంది.

ప్రస్తుతం పలు సినిమాలలో అవకాశాలు అందుకుంది. """/" / ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.

తనకు సంబంధించిన ఫోటోలను బాగా షేర్ చేసుకుంటుంది.బాగా వర్కౌట్లు చేస్తూ వాటికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను షేర్ చేసుకుంటుంది.

తన పెట్స్ తో దిగిన ఫోటోలను కూడా పంచుకుంటుంది.ఈమెకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.

అప్పుడప్పుడు తన అభిమానులతో సరదాగా లైవ్ లోకి వచ్చి ముచ్చట్లు పెడుతుంది.కొన్ని కొన్ని సార్లు తనకు సంబంధించిన ఏదైనా ప్రశ్నలు వేయమని అభిమానులను అడుగుతుంది.

అలా అభిమానులు దొరికిందే ఛాన్స్ అని తెగ ప్రశ్నలు వేస్తూ ఉంటారు.అడగరాని ప్రశ్నలు కూడా వేస్తూ ఉంటారు.

"""/" / వాటిని స్క్రీన్ షాట్ తీసి మరీ వాటికి జవాబులు చెబుతూ స్పందిస్తూ ఉంటుంది.

అలా తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఇన్ స్టా ఖాతాలో మరోసారి అభిమానులకు తన గురించి ప్రశ్న వేసింది.

అభిమానులు వెంటనే తమ మనసులో ఉన్న డౌట్ లు, ప్రశ్నలన్నీ అడిగే సారు.

అందులో కొందరు ఒమిక్రాన్ ప్రశ్నలు వేశారు. """/" / తన పెంపుడు జంతువుల గురించి కూడా సరదాగా ప్రశ్నించారు.

ఇక ఓ నెటిజన్ తన వంట గురించి ప్రశ్న వేయటంతో.నాకు ఎవరిని చంపడం ఇష్టం లేదు అంటూ సరదాగా సమాధానం చెప్పింది.

అంటే తన వంట అంత ఘోరంగా ఉంటుందని నేరుగా చెప్పకనే చెప్పేసింది రష్మిక.

ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్ నెట్టింట్లో వైరల్ గా మారింది.ఇక మరికొంతమంది ప్రశ్నలకు కూడా సమాధానం ఇచ్చింది.

ప్రస్తుతం రష్మిక పలు సినిమాల్లో బిజీగా ఉంది.అందులో బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతుంది.

ఇక టాలీవుడ్ లో కూడా ఇటీవలే ఓ సినిమాలో అవకాశం అందుకున్నట్లు తెలుస్తోంది.

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో శ్రీదేవి కి మాత్రమే దక్కిన అరుదైన ఘనత ఇదే !