సినీ బ్యాక్ గ్రౌండ్ లేని వారికి నేనున్నాను… డైరెక్టర్ తేజ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో డైరెక్టర్ తేజ ( Teja ) ఒకరు.

ఎన్నో అద్భుతమైన సినిమాలను ఇండస్ట్రీకి పరిచయం చేయడమే కాకుండా ఎంతో టాలెంట్ కలిగినటువంటి వారిని ఈయన ఇండస్ట్రీకి పరిచయం చేశారు.

ఇలా తేజ గారు పరిచయం చేసినటువంటి వారు ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలుగా కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే.

ఇకపోతే తాజాగా తేజ దగ్గుబాటి వారసుడు అభిరామ్( Abhiram ) ను హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారు.

వీరిద్దరి కాంబినేషన్లో అహింస అనే సినిమా తెరకెక్కిన విషయం మనకు తెలిసిందే. """/" / ఈ సినిమా జూన్ రెండవ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తేజ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా తేజ మాట్లాడుతూ తాను ఫుట్ పాత్ నుంచి ఈ స్థాయికి వచ్చానని తెలిపారు.

సినిమా ఇండస్ట్రీలో కొనసాగడానికి ఎంతో టాలెంట్ ఉన్నప్పటికీ కొందరికి ఇండస్ట్రీలోకి ఎలా రావాలో తెలియక ఇండస్ట్రీకి దూరం అవుతున్నారని తేజ తెలిపారు.

"""/" / ఇలా టాలెంట్ కలిగి ఉండి సినిమా అవకాశాల కోసం ప్రయత్నించే వారికి నేనున్నాను సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి రావాలనుకున్న వారికి నేను బ్రేక్ ఇస్తానని తేజ ఈ సందర్భంగా తెలియజేశారు.

నేను ఇండస్ట్రీలో కొనసాగుతున్నంత వరకు కొత్తవారికి అవకాశాలు కల్పిస్తానని నేను స్టార్ హీరోలతో సినిమా చేసిన వారి సినిమాలలో కొత్త వారికి అవకాశం కల్పిస్తానని తెలిపారు.

ఇక అభిరామ్ ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తారని రామానాయుడు( Rama Naidu ) గారికి మాట ఇచ్చాను ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసమే ఈ అహింస ( Ahimsa ) సినిమా చేస్తున్నానని తెలిపారు.

ఈ సినిమా ద్వారా వచ్చే డబ్బులతో మరో సినిమా చేస్తానని తన తదుపరి చిత్రం రానా( Rana) తో చేస్తున్నానని ఈ సినిమా తర్వాత తన కొడుకును హీరోగా పరిచయం చేస్తానని ఈ సందర్భంగా తేజ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ప్యాసింజర్ల మీద అరిచిన యూఎస్ ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది.. క్షమాపణలు చెప్పిన కంపెనీ..