హైదరాబాద్ కేంద్రంగా జార్ఖండ్ రాజకీయాలు..!

జార్ఖండ్ రాజకీయాలు హైదరాబాద్ కు( Hyderabad ) చేరాయని తెలుస్తోంది.జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్( Jharkhand CM Hemant Soren ) అరెస్టుతో కాంగ్రెస్ అప్రమత్తం అయింది.

దీంతో తన ఎమ్మెల్యేలను జార్ఖండ్ కాంగ్రెస్ హైదరాబాద్ కు తరలిస్తుందని తెలుస్తోంది.ఈ క్రమంలోనే సుమారు 35 మంది ఎమ్మెల్యేలు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారని సమాచారం.

"""/" / ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు గచ్చిబౌలిలోని హోటల్ ఎల్లాలో వసతి ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

అయితే భూ కుంభకోణం( Land Scam ) మరియు మనీ లాండరింగ్( Money Laundering ) కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ను ఎన్‎ఫోర్స్‎మెంట్ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

అరెస్టుకు ముందే ఆయన తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.ఈ క్రమంలోనే జార్ఖండ్ లో( Jharkhand ) అనూహ్య రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.

మాయమాటలతో జనానికి కుచ్చుటోపీ.. సింగపూర్‌లో భారత సంతతి మహిళకు జైలు