ఉద్యోగాల పేరుతో తెలుగు యువతులను దుబాయ్ కి అమ్మేస్తున్న వ్యక్తి అరెస్ట్....

ప్రస్తుత సమాజంలో డబ్బు కోసం ఎంతటి పాపం చేయడానికైనా మనుషులు వెనకాడడం లేదు.

తాజాగా హైదరాబాదులోని ఓ వ్యక్తి అక్రమంగా డబ్బు  సంపాదించడం కోసం అమాయకమైన, అందమైన యువతులను దుబాయిలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మించి వ్యభిచారం చేసే ముఠాకి అమ్మేస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే ఓ యువతి ఉద్యోగాన్వేషణలో ఉండగా తన స్నేహితురాలి ద్వారా సోమశేఖర్ రెడ్డి అనే వ్యక్తి పరిచయమయ్యాడు.

ఇతడు ఆ యువతికి దుబాయ్ లో తనకు తెలిసిన వాళ్ళు ఉన్నారని ఉద్యోగం ఇప్పిస్తానని అందుకుగాను అందుకుగాను రెండు లక్షల రూపాయలు ఖర్చవుతుందని యువతులు ఇద్దరు నుంచి నాలుగు లక్షల రూపాయలు తీసుకున్నాడు.

అనంతరం వారిని అనుకున్న విధంగానే దుబాయ్ కి పంపించాడు.అయితే దుబాయ్ లో వారిని శ్రీనివాస్ అనే వ్యక్తి  ఉద్యోగం ఇప్పిస్తానని తీసుకెళ్లి హౌస్ అరెస్టు చేశాడు.

అంతేగాక ఆ యువతులను బార్ లో డాన్స్ చేయాలంటూ చిత్ర హింసలు పెట్టేవాడు.

తమ వద్ద ఉన్నటువంటి పాస్ పోర్టులను తీసుకుని తను చెప్పినట్లు చేయకపోతే దొంగ పాస్ పార్టీతో దుబాయ్ వచ్చినట్లు కేసు పెట్టి  జైల్లో వేయిస్తానని  బెదిరించాడు.

దీంతో యువతులు చేసేదేమీలేక బార్ లో డాన్స్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. """/"/అయితే ఇందులో ఓ యువతి ఎలాగో అతడి నుంచి తప్పించుకొని హైదరాబాద్ చేరుకుంది.

అనంతరం ఈ విషయం గూర్చి సోమశేఖర్ రెడ్డిని నిలదీయగా ఇదంతా జరుగుతున్నట్లు తనకు తెలియదని ఇదంతా దుబాయ్ లో ఉన్నటువంటి శ్రీనివాస్ రెడ్డి చేస్తున్నాడని తనకు ఈ విషయానికి ఎలాంటి సంబంధం లేదని ఆ యువతిని నమ్మించాడు.

  ఆ తర్వాత లాభాలు వచ్చే మరో వ్యాపారం ఉందంటూ ఆ యువతితో సోమశేఖర్రెడ్డి 15 లక్షల రూపాయలు తీసుకొని ఇవ్వకుండా వేధిస్తున్నాడు.

దీంతో మోసపోయానని గ్రహించిన యువతి పంజాగుట్టలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.అయితే ఈ కేసు విషయమై కేవలం ఒక్క యువతిని మాత్రమే ఫిర్యాదు చేసిందని ఇంకా ఎవరైనా మోసపోయిన యువతులు ఉంటే వచ్చి పోలీసుల్ని సంప్రదించాలని వారి వివరాలు బయటకు రాకుండా గోప్యంగా ఉంచుతామని పోలీసులు హామీ ఇచ్చారు.

పవన్ కోసం రేణు ఇంత పెద్ద సినిమా నుంచి తప్పుకుందా ? బద్రి సినిమా తర్వాత ఏం జరిగింది ?