తరగతి గదిలో పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయురాలి పై భర్త పైశాచికం.. ?

సమాజంలో జరుగుతున్న దారుణాలకు అంతే లేదు.మనుషులు కిరాతకంగా, కౄరంగా మారి రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు.

అయిన వారిని, కన్న వారిని అని కూడా చూడటం లేదు.ఇకపోతే పశ్చిమ గోదావరి జిల్లాలో స్కూల్ లో పాఠాలు చెప్తున్న ఉపాధ్యాయురాలి పై ఆమె భర్త కత్తితో దాడిచేసిన దారుణ ఘటన చోటు చేసుకుంది.

ఈ ఘటన కు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి మండలానికి చెందిన దుర్గాప్రసాద్ కు 2016లో నాగలక్ష్మి అనే మహిళతో వివాహం జరిగిందట.

కాగా ఈ క్రమంలో వీరికి మూడేళ్ల కూతురు కూడా ఉందట.అయితే గత కొంతకాలంగా దుర్గాప్రసాద్ తో మనస్పర్థలు రావడంతో నాగలక్ష్మి వేరే ఉంటుందట.

ఈ నేపధ్యంలో భార్యపై కక్ష పెంచుకున్న దుర్గాప్రసాద్ క్లాస్ రూంలో విద్యార్ధులకు పాఠాలు చెపుతున్న నాగలక్ష్మి పై కత్తితో దాడి చేశాడు.

ఊహించని ఈ పరిణామానికి విద్యార్థులు కేకలు వేయడంతో స్థానికులు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారట.

కాగా ఇతని దాడిలో గాయపడిన నాగలక్ష్మిని మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి ఆసుపత్రిలో చేర్పించారని సమాచారం.

అమిత్ షా ఫేక్ వీడియో కేసు.. హైదరాబాద్ లో ఢిల్లీ పోలీసుల మకాం