హనుమాన్ ఆలయంలో హుండీ చోరీ…

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla ) రుద్రంగి మండలంలోని ఉమ్మడి మానాల పరిధిలోని గైదిగుట్ట హనుమాన్ ఆలయం( Hanuman Temple )లో గుర్తుతెలియని దుండగులు హుండీ ఎత్తుకెళ్లారు.

ఇట్టి విషయంపై ఆలయ పూజారి తెలిపిన వివరాల ప్రకారం గత మంగళవారం రోజున గుడికెళ్లి పూజలు నిర్వహించి రాగ హుండీ ఉందని ,తిరిగి గురువారం ఉదయం గుడికెళ్లగా తలుపులు తెరుచుకుని ఉండటంతో లోపలికి వెళ్లి పరిశీలించగా హుండీ కనిపించడం లేదని, ఎవరో గుర్తుతెలియని దుండగులు ఉండి ఎత్తుకెళ్లినట్టు, తెలిపారు.

సుమారు పదివేల రూపాయలతో అట్టి ఉండి చేయించడం జరిగిందని,స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

బీజింగ్‌లో గాంధీ జయంతి వేడుకలు.. భారీగా హాజరైన ప్రవాస భారతీయులు