ఆ సర్వే లెక్కలు నిజమైతే కుప్పంలో చంద్రబాబు ఓడిపోతారా.. అక్కడ వైసీపీదే విజయమా?

2019 ఎన్నికల సమయంలో కుప్పంలో చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu )కు ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు.

కుప్పంలో వైసీపీ ప్రయత్నిస్తే మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని కామెంట్లు వ్యక్తమయ్యాయి.అయితే గత కొన్నేళ్లుగా కుప్పం నియోజకవర్గం విషయంలో వైసీపీ ప్రత్యేక దృష్టి పెట్టగా ఈ ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా ఫలితాలు వచ్చే ఛాన్స్ ఉందని చంద్రబాబు ఓడిపోవడం ఖాయమని ఒక సర్వే వెల్లడించింది.

రేస్ సర్వే ఫలితాలలో( RACE Survey Results ) కుప్పంలో టీడీపీ( TDP ) ఓటమి అని వెల్లడి కావడంతో చంద్రబాబు కుప్పంపై దృష్టి పెడితే మంచిదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

కుప్పం( Kuppam ) ఒకప్పుడు టీడీపీకి కంచుకోట అయినా లెక్కలు మారుతున్నాయని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నగరిలో మాత్రమే టీడీపీ గెలుస్తుందని ఈ సర్వే ఫలితాలలో వెల్లడవుతూ ఉండటం గమనార్హం.

"""/"/ టీడీపీకి అనుకూలంగా ఉండే ఒక పత్రికలో సైతం ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చెప్పలేమని ప్రచారం జరుగుతోందంటే ఏపీలో ఎన్నికల ఫలితాలు( AP Elections Results ) ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నాయో అర్థమవుతోంది.

11 సర్వేలలో కూటమికి అనుకూల ఫలితాలు వచ్చాయని చెబుతున్న చంద్రబాబు మిగతా సర్వేలలో మాత్రం కూటమికి అనుకూలంగా ఎందుకు ఫలితాలు రాలేదో చెబితే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

"""/"/ చంద్రబాబు నాయుడు తనకు అనుకూలంగా ఉన్న సర్వేలను మాత్రమే ప్రస్తావిస్తే ప్రయోజనం ఏంటని కామెంట్లు వినిపిస్తున్నాయి.

అన్ని సర్వేలను ప్రస్తావించి ఉంటే కూటమి అసలు పవర్ ఏంటో తేలే అవకాశం ఉండేది.

చంద్రబాబు ఎన్నికల్లో గెలుపు కోసం సర్వేలను సైతం వదలడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు.

చంద్రబాబు నాయుడు గతంలో అమలు చేసిన వ్యూహాలను ఇప్పుడు అమలు చేసి గెలవాలని ప్రయత్నిస్తే వృథా ప్రయత్నమే అవుతుందని నెటిజన్లు చెబుతున్నారు.

రాబోయే రోజుల్లో చంద్రబాబుకు మరిన్ని షాకులు తప్పవని తెలుస్తోంది.చంద్రబాబు నాయుడు కుప్పంలో గెలిచినా మెజార్టీ ఎక్కువగా ఉండదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్5 కుబేరుల జాబితా ఇదే.. ఈ లిస్ట్ లో అమితాబ్ స్థానం ఏంటంటే?