భారతీయ బాలుడిని వరించిన భారీ లాటరీ...మొత్తం ఎంతో తెలిస్తే....

అదృష్టం ఎప్పుడు, ఎవరిని, ఎక్కడ, ఎలా వరిస్తుందో చెప్పలేం.కొందరికి ఊహించని విధంగా రాత్రికి రాత్రి కోట్లు వచ్చిపడుతాయి.

అలాంటి సంఘటనే దుబాయ్ లోని భారత సంతతి కుటుంభంలో చోటు చేసుకుంది.

దుబాయ్ లో డ్యూటీ ఫ్రీ మిలీనియం లాటరీ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకొని భారతీయులు ఉండరు.

ఎంతో మంది ఎన్నో ఏళ్ళుగా లాటరీలో లక్కు కోసం పరితపిస్తూ ఉంటారు.అయితే ఊహించని విధంగా భారత సంతతి బాలుడికి మొదటి సారే డ్యూటీ ఫ్రీ మిలీనియం లాటరీ లో భారీ జాక్ పాట్ కొట్టాడు.

వివరాలలోకి వెళ్తే.భారత సంతతికి చెందిన రెండేళ్ళ బాలుడికి దుబాయ్ లో భారీ లాటరీ దక్కింది.

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 1 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో అక్షరాలా రూ.

7.50 కోట్లు.

అదేంటి రెండేళ్ళ బాలుడికి అంత పెద్ద మొత్తంలో లాటరీ తగలడం ఏంటి అనుకుంటున్నారా.

సదరు బాలుడి తల్లి తండ్రులు తమ కొడుకు పేరుతో లాటరీ టిక్కెట్టు కొనుగోలు చేశారు.

ముంబై కి చెందిన యోగేష్ తన భార్య ధనశ్రీ తో కలిసి షార్జాలో రెండేళ్ళుగా ఉంటున్నాడు.

ఒక రోజు భార్యా భర్తలు ఇద్దరూ ప్రయాణ సమయంలో సరదాగా లాటరీ టిక్కెట్టు కొనుగోలు చేశారు.

371 సీరీస్ లో 2023 అనే నెంబర్ గల టిక్కెట్టును వారి పిల్లాడి పేరు మీద కొనుగోలు చేశారు.

లాటరీ టిక్కెట్టు కొనుగోలు చేయడం వారికి అదే మొదటి సారి కావడంతో మనకు ఒకే సారి ఎలా అదృష్టం వరిస్తుందిలే అనుకున్నారు.

ఎప్పటి లానే వారి బిజీ లైఫ్ గడుపుతున్న క్రమంలో డ్యూటీ ఫ్రీ మిలీనియం లాటరీ వారు డ్రా తీయడంతో ఊహించని విధంగా యోగేష్ కొన్న టిక్కెట్టుకు 1 మిలియన్ డాలర్లు రావడంతో యోగేష్ షాక్ అయిపోయారు.

ముందుగా ఈ వార్తా తాము నమ్మలేదని, డ్యూటీ ఫ్రీ మిలీనియం లాటరీ నిర్వాహకులు తమకు ఫోన్ చేసి చెప్పడంతో ఉబ్బితబ్బిబ్బై పోయామని సంతోషం వ్యక్తం చేశారు.

పెందుర్తి వారాహి విజయభేరి సభలో సీఎం జగన్ పై పవన్ కళ్యాణ్ సీరియస్ వ్యాఖ్యలు..!!