భాగ్యనగరంలో కోల్‌కత్తా.. నానియా మజాకా!

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలను క్యూలో పెట్టి తెలుగు ప్రేక్షకులను ఆతృతగా ఎదురుచూసేలా చేశాడు.

ఇప్పటికే దర్శకుడు ఇంద్రగంటి మోహన్‌కృష్ణ డైరెక్షన్‌లో ‘వి’ అనే సినిమాను రెడీ చేసిన నాని, ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చూశాడు.

కానీ లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది.ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే టక్ వేసుకునీ మరీ మనముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు.

శివ నిర్వాణ డైరెక్షన్‌లో టక్ జగదీష్ అనే చిత్రంలో నటిస్తున్న నాని, ఈ సినిమాను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేయాలని చూస్తున్నాడు.

అటు తన నెక్ట్స్ మూవీని ఓ పీరియాడికల్ చిత్రంగా తెరకెక్కించేందుకు నేచురల్ స్టార్ రెడీ అయ్యాడు.

టాక్సీవాలా చిత్ర దర్శకుడు రాహుల్ సంక్రిత్యన్ డైరెక్షన్‌లో ‘శ్యామ్ సింగ రాయ్’ అనే సినిమాను నాని తెరకెక్కించనున్నాడు.

ఈ సినిమాలో నాని పాత్ర చాలా వైవిధ్యంగా ఉండబోతుందని చిత్ర యూనిట్ ఇప్పటికే తెలిపింది.

కాగా ఈ సినిమా మెజారిటీ శాతం కోల్‌కత్తా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనుంది.అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఇతర దేశాలు, రాష్ట్రాల్లో షూటింగ్ చేసేందుకు తెలుగు స్టార్స్ ఇష్టపడటం లేదు.

దీంతో లాక్‌డౌన్ ముగిసిన తరువాత హైదరాబాద్‌లోనే కోల్‌కత్తాను దించాలని నాని చూస్తున్నాడు.దీని కోసం రామోజీ ఫిలిం సిటీలో భారీ కోల్‌కత్తా సెట్స్‌ను నిర్మించే పనిలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ సెట్స్‌కు భారీగా ఖర్చు చేయనున్నారు చిత్ర నిర్మాత.ఇక ఈ విషయంపై చిత్ర యూనిట్ నుండి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే.

ఏదేమైనా నాని ప్రస్తుతం వరుస చిత్రాలతో టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేయాలని చూస్తున్నాడు.

ఏపీలో జోరుగా సీఎం జగన్ ప్రచార యాత్ర..!