పీపుల్ మార్చ్ పాదయాత్రలో కాంగ్రెస్ లో భారీ చేరికలు…!

సూర్యాపేట జిల్లా:సీఎల్పీ నేత భట్టి విక్రమార్క( Bhatti Vikramarka ) పీపుల్స్ మార్చ్ పాదయాత్ర జిల్లా కేంద్రంలో రెండవ కొనసాగుతున్న సందర్భంగా సూర్యాపేట మున్సిపల్ పరిధిలోని 3 వ వార్డు నుండి మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి,డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ ( Cheviti Venkanna Yadav )ఆధ్వర్యంలో సోమవారం వివిధ )పార్టీలకు చెందిన 60 కుటుంబాలు భట్టి విక్రమార్క సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.

కాంగ్రెస్( Congress ) లో చేరిన వారికి భట్టి పార్టీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోని సాదరంగా ఆహ్వానించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం జరుగుతుందని, ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు అన్ని వస్తాయని అన్నారు.

పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఎఫెక్ట్ తో గ్రామాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

చిరంజీవి, పవన్ కాళ్లను బన్నీ మొక్కాలి.. జనసేన నేత సంచలన వ్యాఖ్యలు వైరల్!