ఓ ప‌క్క భారీగా మంట‌లు.. ఈ అమ్మాయి చేసిన ప‌నికి అంతా షాక్‌

ఇది సోషల్ మీడియా యుగం.ఎక్కడ ఏ సంఘటన జరిగినా చిటికెలో ప్రపంచానికి తెలిసిపోవడం ఖాయం.

కేవలం సోషల్ మీడియా దెబ్బకే ప్రభుత్వాలు కూలిపోయిన పరిస్థితులు చూస్తూనే వున్నాం.చీమ చిటుక్కుమన్నా క్షణాల్లో తెలిసిపోతుంది.

ఉదయం నుండి రాత్రి వరకు సోషల్ మీడియాలోనే చాలా మంది కాలం గడుపుతున్నారు.

అంతలా మానవ హృదయంతరాల్లోకి చొచ్చుకుని వెళ్లింది సోషల్ మీడియా.తాజాగా ఒక అగ్ని ప్రమాద వీడియా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సాధారణంగా అగ్ని కనిపిస్తే చాలు అక్కడి నుండి పక్కకు జరుగుతాం.కానీ అగ్ని ప్రమాదం జరుగుతుంటే తాపీగా ఉయ్యాల ఊగుతూ కనిపించి అందరు అవాక్కయ్యేలా చేసింది.

దావానలంలా మంటలు ఎగసిపడుతుంటే ఏమి పట్టనట్టు ఒళ్ళో చంటిబిడ్డతో ఉయ్యాల ఊగింది.ఈ వీడీయో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

కోట్లాస్ పట్టణంలోని ఓ ప్రాంతంలో శనివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.

ఖరీదైనా ఇల్లన్ని చూస్తుండగానే అగ్నికి అహుతి అయిపోయాయి.ఆ మంటలు చుట్టుపక్కల ఇళ్లకు వ్యాప్తి చెందాయి దీంతో ప్రజలు ఆహాకారాలు పెట్టారు.

ఫైర్ ఇంజన్లు, అత్యవసర సేవల విభాగాల అధికారులు సేవలు అందిస్తూ ప్రజలను కాపాడుతున్నారు.

"""/"/ఇలాంటి ఉద్రిక్తత పరిస్థితిలో ఆ భవనాల పక్కనే వున్న పార్క్ లో ఓ మహిళ ఒళ్ళో బిడ్డను పెట్టుకుని ఊయల ఊగుతూ తాపీగా కనిపించింది.

ఆమెను చూసి అందరూ షాక్ కు గురయ్యారు.ఈ తతంగాన్ని ఒక వ్యక్తి వీడియో తీసి నెట్ లో పెట్టేశాడు.

దీంతో ఈ వీడియోకు లక్షల్లో వీవ్స్ వచ్చేశాయి.ఆమె ప్రవర్తనకు కొందరు పాజిటీవ్ గా సమాధానం ఇచ్చినా కొంతమంది మాత్రం నెగిటీవ్ గా కామెంట్లు చేశారు.

ప్రస్తుతం ఇలాంటి వీడియోలు కోకొల్లలుగా నెట్టింట్లో వైరల్ అవుతుంటే ఈ వీడియో గురించి మాత్రం అత్యంత చర్చ జరుగుతుంది.

రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్టు ఈమె ప్రవర్తన కనిపించిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నాడు.

తాజాగా ఇన్‌స్టాలో ఒకరికి ఒకరు అన్‌ఫాలో చేసిన ఆ సెలబ్రిటీలు..