రంగారెడ్డి జిల్లా నార్సింగిలో భారీగా నగదు పట్టివేత

రంగారెడ్డి జిల్లా నార్సింగిలో భారీగా నగదు పట్టుబడింది.నార్సింగి రోటరీ వద్ద సుమారు రూ.

కోటి నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.కోకాపేట నుంచి హైదరాబాద్ వెళ్తున్న కార్లలో నగదును గుర్తించారు.

అయితే ముందుగా పోలీసులను గుర్తించిన కార్ల డ్రైవర్లు వేగంగా ముందుకు సాగారు.ఈ నేపథ్యంలో వారిని వెంబడించి పట్టుకున్న పోలీసులు కార్లలోని బ్యాగుల్లో నగదును గుర్తించారు.

ఈ వ్యవహారంలో ముగ్గురును పోలీసులు అదుపులోకి తీసుకోగా.మరో నలుగురు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.

మొత్తంగా రూ.కోటి నగదుతో పాటు రెండు కార్లు, బైకు, ఆరు సెల్ ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు.

అయితే మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో ఈ మధ్య కాలంలో భారీగా నగదు పట్టుబడుతున్న విషయం తెలిసిందే.

వీడియో: కాలుపైనే హెవీ మెషిన్ గన్ ఆపరేట్ చేస్తున్న సుడానీస్ సైనికులు..