మైత్రీ నిర్మాతలపై ఊహించని స్థాయిలో భారం.. అన్ని వందల కోట్లు రాబట్టాలా?
TeluguStop.com
టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ బ్యానర్లలో మైత్రీ మూవీ మేకర్స్( Mythri Movie Makers ) కూడా ఒకటి.
ఈ బ్యానర్ లో తెరకెక్కిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి.అయితే కొన్ని వారాల గ్యాప్ లో మూడు సినిమాలతో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మతలు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
ఈ మూడు సినిమాలు మైత్రీ నిర్మాతలకు లాభాలను అందిస్తాయో నష్టాలను అందిస్తాయో చూడాల్సి ఉంది.
అయితే మైత్రీ నిర్మాతలపై ఊహించని స్థాయిలో భారం పడనుందని తెలుస్తోంది.రాబిన్ హుడ్ సినిమా( Robinhood Movie ) ఏకంగా 70 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కగా ఈ సినిమా విషయంలో 25 కోట్ల రూపాయల థియేట్రికల్ రిస్క్ ఉంది.
బాక్సాఫీస్ వద్ద 25 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధిస్తే ఈ సినిమా సంచలనాలను సృష్టించే ఛాన్స్ అయితే ఉంది.
అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ( Good Bad Ugly Movie ) కూడా మైత్రీ బ్యానర్ పై తెరకెక్కిన సినిమా అనే సంగతి తెలిసిందే.
"""/" /
ఈ సినిమా బడ్జెట్ ఏకంగా 200 కోట్ల రూపాయలు అని సమాచారం అందుతోంది.
గోపీచంద్ మలినేని సన్నీ డియోల్ కాంబో మూవీ 150 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కింది.
ఈ సినిమాలకు సంబంధించి 200 కోట్ల రూపాయల వరకు థియేట్రికల్ కలెక్షన్లు రావాల్సి ఉంది.
ఈ రెండు సినిమాలు ఏప్రిల్ నెలలో రిలీజ్ కానున్నాయని సమాచారం అందుతోంది.మైత్రీ నిర్మాతలు ఒక విధంగా బిగ్ రిస్క్ చేశారని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.
"""/" /
మైత్రీ మూవీ మేకర్స్ బాక్సాఫీస్ వద్ద మరిన్ని సంచలనాలను సృష్టిస్తే రాబోయే రోజుల్లో ఈ బ్యానర్ కు తిరుగుండదని చెప్పవచ్చు.
పుష్ప ది రూల్ సినిమా మైత్రీ నిర్మాతలకు కళ్లు చెదిరే లాభాలను అందించింది.
ప్రస్తుతం తెలుగులో కమర్షియల్ సినిమాలను నిర్మిస్తున్న నంబర్ వన్ బ్యానర్ ఏదనే ప్రశ్నకు మైత్రీ మూవీ మేకర్స్ పేరు సమాధానంగా వినిపిస్తుంది.