జమిలీ ఎన్నికల నిర్వహణపై కేసీఆర్ నిర్ణయం ఎలా ఉండనుంది?
TeluguStop.com
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా జమిలీ ఎన్నికలపై దేశ వ్యాప్త చర్చ జరుగుతోంది.మోడీ ప్రభుత్వం తీసుకవచ్చిన ఈ వినూత్న ఆలోచన ఇప్పటికీ ఇంకా కార్యరూపం దాల్చలేదు.
గత ఎన్నికలలో జమిలీ ఎన్నికలను అమలు చేద్దామని నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఈ ఎన్నికలలో అమలు చేయాలని యోచిస్తోంది.
ప్రతి రెండేండ్ల కొకసారి ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్న తరుణంలో ప్రతి ఎన్నిక నిర్వహణకు పెద్ద ఎత్తున నిధులు ఖర్చు అవనుండడంతో ఈ జమిలీ ఎన్నికల నిర్ణయం తీసుకుంది.
కాని ఈ విషయంపై ప్రతి ఒక్క రాష్ట్రం యొక్క అభిప్రాయాన్ని ప్రభుత్వం తీసుకుంటోంది.
కాని ఈ విషయంపై కేసీఆర్ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.వెల్లడించలేదు కూడా.
వచ్చే సంవత్సరం జమిలీ ఎన్నికలకు సిద్దమవుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం జమిలీ ఎన్నికలకు సిద్దమని ప్రకటించిన పరిస్థితిలో ఇక కేసీఆర్ ఈ నిర్ణయంను ఆమోదిస్తే ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది.
బీజేపీ ఇంకా బలపడి ఉండి ఉంటే కేసీఆర్ నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం లేకపోలేదు.
అప్పటి పరిస్థితులలో కేసీఆర్ నిర్ణయం రాజకీయ వర్గాలలో కలకలం రేగే అవకాశం ఉంది.