యాత్రలకు వెళ్తే ఇంట్లో ఉన్న దేవుళ్ల సంగతేంటి..? పూజించడం ఎలా?
TeluguStop.com
దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో దేవతా మూర్తులు ఉంటారు.ప్రత్యేక పూజా గది ఉన్నా లేకపోయినా చిన్న పాటి స్థలంలోనైనా దేవతల ఫోటోలను, విగ్రహాలను పెట్టుకుని పూజిస్తూ ఉంటారు.
సోమ, శుక్ర, శని వారాల్లో దేవతలను పూజిస్తారు.ఇంట్లో శుభం కలగాలని ప్రార్థిస్తారు.
ఇంట్లో దీపం వెలిగించి, అగరు బత్తుల వాసన వస్తుంటే ఆ ఇళ్లంతా ఆధ్యాత్మికత సంతరించుకుంటుంది.
నుదుటన బొట్టు పెట్టుకున్న వారిలో తెలియని కళ కనిపిస్తుంది.అయితే ప్రతి ఒక్కరో ఏదో ఒక సమయంలో ఇంటిని వదిలి దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది.
బంధువులు, మిత్రుల ఇంటికి అప్పుడప్పుడు వెళ్లాల్సిన అవసరం తలెత్తుతుంది.అలాంటి సందర్భాల్లో ఒకటికి మించి రోజులు ఇంటిని వదిలి ఉండాల్సి వస్తుంది.
అలాంటి సమయంలో ఇంట్లో ఉన్న దేవతలకు పూజలు ఎలా అనే అనుమానం చాలా మందికే వస్తుంటుంది.
కానీ ఇంటిని వదిలి ఉండాల్సిన సమయంలో పూజలు చేయడం అసాధ్యం.అలాంటి సందర్భాల్లో ఏం చేయాలి.
అటువంటి సందర్భంలో దేవతా విగ్రహాలు, దేవతా యంత్రాలను, దేవతార్చనలను బియ్యం డబ్బాలో పెట్టి మూత వేసి వుంచాలి.
తిరిగి వచ్చిన తరువాత వాటికి సంప్రోక్షణ చేసి, ప్రాణ ప్రతిష్ట చేసి యధావిధిగా నిత్యం దీప, ధూప, నైవేద్యాలతో అర్చించు కోవచ్చని పండితులు చెబుతున్నారు.
ఇది పెద్దలు ఏర్పరచిన ఆచారం.ప్రయాణానికి వెళ్ళే సమయంలో దేవతార్చన, దేవతా విగ్ర హాలు, దేవతా యంత్రాలను వుంచిన బియ్యముతో వంట చేసి దేవతా నివేదన చేయాలి.
అది అత్యంత శ్రేష్టమని శాస్త్రాలు చెబుతున్నాయి.
నా భర్త సిద్దార్థ్ అలాంటి మనిషి.. అదితీరావు హైదరీ క్రేజీ కామెంట్స్ నెట్టింట వైరల్!