రాధేశ్యామ్ కోసం మొత్తం ఎన్ని సెట్లు వేసారో తెలుసా..?

ప్రభాస్, పూజా హెగ్దే జంటగా రాధాకృష్ణ డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా రాధే శ్యామ్.

యువి క్రియేషన్స్ వారు దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా మార్చి 11న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.

ఈ సినిమాలో సగం బడ్జెట్ సినిమా సెట్స్ కే ఖర్చు చేసినట్టు తెలుస్తుంది.

ఒక సినిమాకు మాములుగా అయితే ఒకటి రెండు సెట్లు వేస్తారు.కొద్దిగా పీరియాడికల్ మూవీ అయితే ఓ పది సెట్లు వేస్తారు.

కానీ రాధే శ్యామ్ సినిమా కోసం ఏకంగా 101 సెట్లను వేశారట.ఆర్ట్ డైరక్టర్ ఈ సినిమాకు చాలా కష్టపడి పనిచేశారని తెలుస్తుంది.

కరోనా టైం లో యూరప్ సెట్ కూడా హైదరాబాద్ లో వేశారట.అసలు సినిమాలో నిజం లొకేషన్ కి ఈక్వల్ గా సెట్స్ ఉంటాయని అంటున్నారు.

రాధే శ్యామ్ సినిమా ప్రేక్షకులకు ఓ విజువల్ వండర్ గా అనిపిస్తుందని అంటున్నారు.

సినిమాలో విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్, ప్రేరణగా పూజా హెగ్దే నటిస్తుంది.జస్టిన్ ప్రభాకరణ్ అందించిన మ్యూజిక్ తో పాటుగా థమన్ అందించే బిజిఎం సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు.

పొట్ట కొవ్వు ఐసు ముక్కలా కరగాలంటే ఈ డ్రింక్ ను తీసుకోండి!