భీమునికి 10వేల‌ ఏనుగుల బ‌లం ఎలా వ‌చ్చిందో తెలిస్తే..

మీరు మహాభారతంలోని చాలా కథలను చదివే ఉంటారు.ఇందులో భీముడు పాండవులలో అత్యంత శక్తిమంతునిగా క‌నిపిస్తాడు.

భీముడికి 10 వేల ఏనుగులతో సమానమైన బలం ఉందని చెబుతారు.అయితే భీముడికి అంత శక్తి ఎలా వచ్చిందో ఒక ఆసక్తికరమైన పౌరాణిక గాథ ద్వారా తెలుసుకుందాం.

పురాణాల ప్రకారం కౌరవులు హస్తినాపురంలో జన్మించారు.పాండవులు అడవిలో జన్మించారు.

పాండవులు పుట్టిన కొన్ని సంవత్సరాలకు వారి తండ్రి పాండురాజు చనిపోయాడు.ఈ విష‌యాన్ని ఆ అరణ్యంలో నివసించే ఋషులు హస్తినాపురానికి చేరుకుని భీష్ముడు, ధృతరాష్ట్రులకు పాండవులు పుట్టిన వార్తను, వారి తండ్రి పాండు మరణించిన వార్తను తెలిపారు.

వెంట‌నే భీష్ముడు తల్లి కుంతితో సహా ఐదుగురు పాండవులను హస్తినాపురానికి పిలిచాడు.హస్తినకు చేరుకున్న తర్వాత పాండవులందరూ కౌరవులతో కలిసి ఆడుకోవడం ప్రారంభించారు.

అయితే అన్ని ఆటల్లోనూ భీముడు ఒక్కడే ధృతరాష్ట్ర కుమారులందరినీ ఓడించేవాడు.ప్రతీ ఆటలో భీముడి చేతిలో ఓడిపోవడంతో దుర్యోధనుడికి భీమునిపై ద్వేషం పెరిగింది.

అవకాశం వస్తే భీముడిని చంపేయాలని ఆలోచించడం మొదలుపెట్టాడు.భీముడిని చంపాలని.

ఒకసారి దుర్యోధనుడు ఆడుకోవడానికి గంగానది ఒడ్డున ఒక శిబిరాన్ని ఏర్పాటు చేశాడు.అక్కడ భోజన, పానీయ సౌకర్యాలు కూడా కల్పించారు.

దుర్యోధనుడు పాండవులందరినీ ఆడుకోవడానికి పిలిచాడు.ఇంతలో దుర్యోధనుడు భీముని ఆహారంలో విషం కలిపాడు.

ఆ తర్వాత ఆహారం తిన్న వెంటనే భీముడు అపస్మారక స్థితికి చేరుకున్నాడు.అప్పుడు దుర్యోధనుడు, దుశ్శాసనునితో కలిసి భీముడిని గంగా నదిలోకి విసిరాడు.

ఈ అపస్మారక స్థితిలో భీముడు నాగలోకానికి చేరుకున్నాడు.పాములు అతన్ని ఎక్కువగా కాటేశాయని.

ఈ ప్రభావం వల్ల భీముడి శరీరంలో విషం ప్రభావం తగ్గడం ప్రారంభించిందని చెబుతారు.

భీముడు స్పృహలోకి వచ్చేసరికి తన చుట్టూ చాలా పాములు కనిపించాయి.ఆ తర్వాత వాటిని చంపడం ప్రారంభించాడు.

దీంతో అన్ని పాములు భయపడి, నాగరాజు వాసుకి వద్దకు వచ్చి విషయం మొత్తం చెప్పాయి.

నాగరాజు వాసుకి భీముని గొప్ప‌ద‌నాన్ని గుర్తించి10 వేల ఏనుగుల బలం క‌లిగిన ఆ కొలనులోని శ‌క్తివంత‌మైన నీటిని తాగేందుకు అనుమ‌తినిచ్చాడు.

ఇక్కడ ఆడుకుని కౌరవులు, పాండవులు అందరూ ఇంటికి తిరిగి వచ్చారు.కానీ భీముడు తిరిగి రాకపోవడంతో, అందరూ అత‌ని కోసం వెతకడం ప్రారంభించారు.

మరోవైపు.నాగలోకంలో కొల‌నులోని నీరు జీర్ణం అయినప్పుడు, భీముడు నిద్ర నుండి మేల్కొన్నాడు.

దీంతోసర్పాలు అతన్ని గంగా నది వెలుపల వదిలివేసాయి.ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత భీముడు తల్లి కుంతితో పాటు అతని సోదరులకు ఈ విష‌యాన్ని చెప్పాడు.

ఆ తర్వాత ఈ విషయం మరెవరికీ చెప్పవ‌ద్ద‌ని యుధిష్ఠిరుడు భీముడికి తెలిపాడు.