మామిడి తోటల్లో అధిక దిగుబడి.. కలుపు నివారణ కు సరైన పద్ధతులు ఇవే..!

మామిడి తోటలలో అధిక దిగుబడి సాధించాలంటే ముఖ్యంగా కలుపు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

ఒక సంవత్సరంలో కనీసం రెండుసార్లు పొలాన్ని బాగా దుక్కి దున్నితే కలుపు శాతం తక్కువగా ఉంటుంది.

తొలకరి చినుకులు పడ్డాక నేలలో తేమశాతం చూసుకొని బాగా దున్నితే లేత కలుపు మొక్కలతో పాటు, పురుగులు, శిలీంద్రాలు అమాంతం నాశనం అవుతాయి.

పైగా ఇలా దుక్కి దున్నడం వలన భూమి భౌతిక లక్షణాలు కూడా చాలా వరకు మెరుగు పడతారు.

ఇక సెప్టెంబర్ నెలలో రెండోసారి భూమిని బాగా దుక్కి దున్నుపోవాలి.ఎందుకంటే సెప్టెంబర్ నెలలో కూడా అప్పుడప్పుడు చినుకులు కురుస్తాయి.

ఇంకా వీలైతే మధ్యలో ఇంకోసారి కూడా దుక్కి దున్నడం వలన పూర్తిగా కలుపు తొలగిపోతుంది.

ఎప్పుడైతే పొలంలో కలుపు శాతం తక్కువగా ఉంటుందో అప్పుడు పురుగులు, కీటకాల బెడద చాలావరకు లేనట్టే.

ఇక పంట పొలానికి క్రమం తప్పకుండా సరైన పద్ధతిలో నీరు అందించాలి. """/"/ ఇక ఎకరానికి 15 నుండి 20 కిలోల వరకు పచ్చిరొట్ట ఎరువులైన పిల్లి పెనర, జనుము మిశ్రమాన్ని జులై నెలలో పంటలో వేసుకోవాలి.

అంటే చెట్లు పూతకు వచ్చే 45 రోజుల ముందు ఇవి భూమి ను బాగా దుక్కి తినాలి.

ఈ పద్ధతి పాటించడం వలన పురుగుల గడ్డి, గరిక గడ్డి పెరగదు.చేయడం వలన చెట్లకు సమృద్ధిగా నీరు కూడా అందుతుంది.

ఇక భూమిలో తేమ లేనప్పుడు క్రిమిసంహారక మందులైన గైపొసెట్ 10 మిల్లీలీటర్లు, అమోనియం సల్ఫేట్ 10 గ్రాములు కలిపి, మామిడి మొక్కలపై పడకుండా నేలపై పిచికారి చేసుకోవాలి.

ఇక తొలకరి చినుకుల సమయంలో 23.5% అక్సీ ఫ్లోరోఫిన్ ద్రావణం పిచికారి చేస్తే చాలావరకు కలుపు సమస్య ఉండదు.

మామిడి తోటల్లో ఎప్పుడైతే కలుపు సమస్య ఏదో ఉండదో, అధిక దిగుబడి సాధించి మంచి లాభం పొందవచ్చు.

బిగ్ బాస్ రెమ్యూనరేషన్ మొత్తం వారికి విరాళంగా ప్రకటించిన బేబక్క?