గుడివాడలో హైటెన్షన్ వాతావరణం.!!

కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా వైసీపీ, టీడీపీ చేస్తున్న పోటాపోటీ కార్యక్రమాలతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ గ్రౌండ్స్ వద్ద ఇరు పార్టీలకు చెందిన నేతలు నివాళులు అర్పించేందుకు పోటీ పడ్డారు.

ఈ నేపథ్యంలోనే టీడీపీ, జనసేన పార్టీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు.దీంతో టీడీపీ, జనసేన నేతలకు పోలీసులకు మధ్య చోటు చేసుకున్న వాగ్వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.

తమ అభిమాన నేతకు నివాళులు అర్పించేందుకు వెళ్తున్న తమను పోలీసులు అడ్డుకోవడం సరికాదని టీడీపీ, జనసేన నేతలు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు.

మరోవైపు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించేందుకు వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని కూడా వచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు.

రెండు పార్టీలకు చెందిన నేతలు గొడవ పడకుండా ఉండేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఈ క్రమంలోనే కొడాలి నాని,ఆయన అనుచరులు వెళ్లిపోయిన తరువాత టీడీపీ నేతలను పోలీసులు అనుమతించారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూలై16, మంగళవారం 2024