ఏపీలో సర్పంచ్ ల పదవి కాలం ముగిసినా .పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా స్పెషల్ ఆఫీసర్లను ప్రభుత్వం నియమిస్తోందని, దిగువ క్యాడర్ ఉద్యోగులను ప్రత్యేక అధికారులుగా నియమిస్తోందని మాజీ సర్పంచులు హైకోర్టు లో సవాల్ చేశారు.
వెంటనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
ఈ పిటిషన్ పైన విచారణ జరిపిన న్యాయస్థానం ప్రత్యేక అధికారుల పాలనను కొనసాగిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 90ని కొట్టేసింది.
అంతేకాదు, మూడు నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
ప్రభాస్ రాజాసాబ్ సినిమా రిలీజ్ కి రంగం సిద్ధం చేస్తున్నారా..?