చంద్రబాబు బెయిల్ పై కండిషన్ల పిటిషన్ పై హైకోర్టు ఆదేశాలు

టీడీపీ అధినేత చంద్రబాబుకు మంజూరైన మధ్యంతర బెయిల్ పై కండిషన్లు అమలు చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.

ఈ మేరకు పిటిషన్ పై వాదనలు విన్న న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఈ క్రమంలోనే చంద్రబాబు కార్యకలాపాల పరిశీలనకు ఇద్దరు డీఎస్పీలను పెట్టాలన్న సీఐడీ అభ్యర్థనను తిరస్కరించింది.

అదేవిధంగా పొలిటికల్ ర్యాలీల్లో పాల్గొనకూడదన్న కేసుకు సంబంధించి ఏం మాట్లాడకూడదని ఆదేశాలు జారీ చేసింది.

దాంతో పాటు స్కిల్ డెవలప్ మెంట్ కేసుపై మీడియాతో మాట్లాడొద్దన్న ఆదేశాలు కొనసాగుతాయని న్యాయస్థానం స్పష్టం చేసింది.

అఖిల్ కెరియర్ ఎటు పోతుంది..? 10 సంవత్సరాల్లో ఆయన సాధించిన సక్సెస్ సినిమాలు ఎన్ని..?