టీడీపీ నేత పట్టాభికి బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు..!!

ఇటీవల తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి సీఎం వైఎస్ జగన్ పై దారుణమైన బూతు పదాలు తిట్టడంతో.

ఆయన నీ ఇటీవల అరెస్టు చేయటం తెలిసిందే.ఈ మేరకు పట్టాభి నీ రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించడం జరిగింది.

ఇదిలా ఉంటే హైకోర్టు దృష్టికి కేసు వచ్చిన తరుణంలో సీఎం జగన్ ని పట్టాభి దారుణంగా విమర్శలు చేసిన వీడియోలను.

సీడీలను ప్రభుత్వపు తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకు వచ్చి సమర్థవంతంగా వాదనలు వినిపించారు.

"""/" / ఈ తరుణంలో పట్టాభి తరపు న్యాయవాదులు అతనిపై పెట్టిన సెక్షన్లు, కేసులు అతడు చేసిన వ్యాఖ్యలకు.

వర్తించవని బలంగా తమ వర్షన్ వాదనలు వినిపించారు. అంతేకాకుండా పట్టాభి ని పోలీసులు అరెస్టు చేసిన తీరు కూడా సరిగా లేదని కోర్టుకి తెలియజేశారు.

ఇటువంటి తరుణంలో హైకోర్టు పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ సిఆర్పిసి 41 ప్రకారం నోటీసులు ముందస్తుగా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించి పోలీసుల వైఖరి సరిగా లేదని కోర్టు తప్పుపట్టడం జరిగింది.

ఈ నేపథ్యంలో పోలిసుల తీరు సరైన న్యాయపరమైన విధానం లేకుండా.ఉండటంతో పట్టాభికి బెయిల్ మంజూరు చేస్తున్నట్లు.

న్యాయస్థానం పేర్కొంది.

కుప్పం అభ్యర్థిగా రేపు చంద్రబాబు నామినేషన్