తిరుమల తిరుపతి లో హీరోయిన్ శ్రియ దంపతులు..!!

ఇష్టం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టిన శ్రియ.అతి తక్కువ టైమ్ లోనే దేశవ్యాప్తంగా టాప్ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించింది.

సౌత్ ఇండియాలో ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఇండస్ట్రీలో టాప్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ కొద్ది సంవత్సరాల క్రితం ఆండ్రీ కొశ్చేవ్‌ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోవడం తెలిసిందే.

ఇదిలా ఉంటే తాజాగా శ్రియ దంపతులు ఈరోజు ఉదయం వీఐపీ దర్శనంలో తిరుమల తిరుపతిలో శ్రీవారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.అనంతరం మీడియాతో మాట్లాడిన శ్రేయ కరోనా కారణంగా రెండు సంవత్సరాలుగా తిరుమల తిరుపతి రాలేకపోయిన స్వామివారిని దర్శించలేక పోయినట్లు.

పేర్కొన్నారు.ప్రస్తుతం శ్రియ "RRR" తో పాటు మరికొన్ని సినిమాల్లో నటిస్తోంది.

వైరల్ వీడియో: టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..