నన్ను లైంగికంగా వేధించారు అంటున్న చిరంజీవి హీరోయిన్

సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేదింపుల గురించి హీరోయిన్స్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ వరకు మీటూ అంటూ మొదటి సారి దేశ వ్యాప్తంగా నోరు విప్పారు.

ఇండస్ట్రీలో తమకి జరుగుతున్న వేదింపులు, గతంలో చాలా మంది దర్శకులు, నిర్మాతలు, నటులతో తనకి ఎదురైనా శారీరక వేదింపులపై మీడియా ముందుకి వచ్చి చాలా మంది గళం విప్పారు.

ఈ మీటూ దేశ వ్యాప్తంగా సంచలనంగా మారడంతో ఎంతో మంది నటుల అసలు రూపాన్ని పరిచయం చేసింది.

అయితే ఈ మీటూ ఉద్యమనాన్ని అవకాశంగా వాడుకొని కావాలని కొందరు నటీమణులు నటులపై వేదింపుల ఆరోపణలు చేసారు.

ఇదిలా ఉంటే తెలుగు, తమిళ, హిందీ భాషలలో హీరోయిన్ గా నటించిన సమీరా రెడ్డి తాజాగా మీటూ గురించి ఆసక్తికర వాఖ్యలు చేసింది.

పెళ్లి చేసుకొని సినిమాలకి దూరం అయిన ఈ భామ తాజాగా మీడియా ముందుకి వచ్చింది.

తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్న సమీరా రెడ్డి ఇండస్ట్రీలో తనకి కూడా లైంగిక వేదింపులు ఎదురయ్యాయి అని చెప్పింది.

అయితే ఇండస్ట్రీలో స్ట్రీ, పురుషుల సమానత్వం లేకపోవడం వలనే ఇదంతా జరిగింది అని.

ఈ మీటూ వలన ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో మార్పు కనిపిస్తుంది అని చెప్పుకొచ్చింది.

అయితే సమీరాని వేధించిన వారు ఎవరనే విషయాన్ని మాత్రం ఈ భామ చెప్పలేదు.

పవన్ కళ్యాణ్ కు ఓటమి అలవాటే.. పిఠాపురం విషయంలో మాత్రం పవన్ లక్ష్యం ఇదే!