Gayathri Raghuram: అస్సలు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఒకప్పటి పాపులర్ హీరోయిన్…ఎవరో గుర్తు పట్టారా?

ఒకప్పుడు సినీ పరిశ్రమలో హీరోయిన్లు వయసైపోయేంతవరకు నటించేవారు.కానీ ఇప్పుడు పరిస్థితి వేరు.

ఈ కాలంలో ఒకటి, రెండు చిత్రాలతోనే హీరోయిన్ల భవిష్యత్తు తెలిసిపోతుంది.కొందరు మొదటి చిత్రం తోనే స్టార్లుగా మారిపోతుంటే.

మరీ కొందరు మాత్రం ఒకటి, రెండు సినిమాలు చేసాక కనుమరుగైపోతున్నారు.తాజాగా ఒక తెలుగు హీరోయిన్( Telugu Heroine ) గుండు చేసుకొని ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈమె తెలుగులో హీరోయిన్ గా చేసింది రెండు సినిమాలే అయినా, ఆమె నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇంతకీ ఆమె ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? """/" / గాయత్రీ రఘురాం.( Gayathri Raghuram ) ఈమె అందరికి తెలియకపోవచ్చు.

ఎందుకంటె ఈమె చాల తక్కువ చిత్రాలలో నటించింది.ఈమె నటించిన మొదటి చిత్రం "రేపల్లెలో రాధ".

( Repallelo Radha ) ఈ చిత్రం 2001 లో విడుదలయింది.ఐతే ఈ చిత్రం అనుకున్న విజయం సాధించలేదు.

ఈమె నటించిన రెండో చిత్రం "బాపుబొమ్మకు పెళ్ళంటా".( Bapubommaku Pellanta Movie ) 2003లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది.

ఈ చిత్రంలో రెండు జాడలు వేసుకొని కుందనపు బొమ్మలా ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టిన అమ్మాయే ఈ గాయత్రీ రఘురాం.

రెండో చిత్రంతోనే ఫేమస్ ఐనప్పటికీ, ఈమె తరువాత చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్నారు.

2006 లో దీపక్ చంద్రశేఖర్ అనే వ్యక్తిని పెళ్లి కూడా చేసుకుంది.కానీ కొన్ని కారణాల వల్ల వీరు 2010 లో విడాకులు తీసుకున్నారు.

"""/" / తరువాత ఆమె కొంత కాలం బీజేపీ తో( BJP ) కలిసి పని చేసారు.

కొంత కాలం తరువాత పార్టీ నుంచి బయటకు వచ్చి తిరిగి సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టారు.

నితిన్ హీరోగా నటించిన "రంగ్ దే"( Rang De Movie ) సినిమాలో హీరో సోదరిగా నటించింది గాయత్రి.

ఈమె కొన్ని స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది.ఐతే ఈమె ఈమధ్యే తిరుపతి వెళ్లి వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.

అక్కడ తలనీలాలు కూడా సమర్పిచారు.ఈ సందర్భంగా కొన్ని ఫోటోలను సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు.

ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు, గుర్తుపట్టలేనంతగా మారిన గాయత్రిని చూసి షాక్ అవుతున్నారు.

జేఎన్టీయూహెచ్ కిచెన్‌లో పిల్లి ప్రత్యక్షం.. ఎలుక కోసమే వచ్చిందంటూ నేతలు జోకులు..!