షూటింగ్ లో జరిగిన ప్రమాదం ఈ హీరో భవిష్యత్తుని మార్చేసింది !

శ్రీరామ్.20 ఏళ్లుగా ఇండస్ట్రీ లో ఉన్న అన్ని భాషల్లో నటిస్తున్న కూడా ఇప్పటికి సరైన గుర్తింపు రాని నటులలో శ్రీరామ్ కూడా ఒకరు.

ఒకరికి ఒకరు సినిమా తో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయినా శ్రీరామ్ మొదట తమిళ భాషలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.

మొదటి రెండు సినిమాలతోనే తమిళంలో మంచి గుర్తింపు లభించడంతో పాటు మంచి అవకాశాలు కూడా వచ్చాయి.

ఇక 2007 లో వచ్చిన ఆడవారి మాటలకూ అర్థాలు వేరులే సినిమా తో రెండవ హీరోగా నటించి తెలుగు లో సైతం మంచి నటుడిగా పేరు సంపాదించుకున్నాడు.

అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటన శ్రీరామ్ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది.

ఆడవారి మాటలకు అర్దాలు వేరులే సినిమాలో శ్రీరామ్ తో పాటు వెంకటేష్, త్రిష హీరో హీరోయిన్స్ గా నటించారు.

త్రిష తో ఒక పాట షూటింగ్ జరుగుతున్న సమయంలో పక్కన ఎఫెక్ట్ కోసం నిప్పు పెట్టాల్సి వచ్చిందట.

అయితే పొరపాటున ఆ నిప్పు శ్రీరామ్ మొఖానికి బలంగా తగలడం తో కళ్ళు, పెదాలు, కనుబొమ్మలు అన్ని కాలిపోయాయి.

అంతే కాదు చేతులకు సైతం చర్మం మొత్తం కాలిపోయింది.ఆలా ఈ సినిమా షూటింగ్ లో జరిగిన ప్రమాదం వలన మొత్తంగా రెండేళ్ల పాటు సినిమాలకు దూరం అయ్యాడు శ్రీరామ్.

"""/"/ ఇక ప్రస్తుతం తెలుగు, తమిళ్ సినిమాలతో ఫుల్ బిజీ గా ఉన్న శ్రీరామ్ కెరీర్ మొత్తం మీద 40 కి పైగా చిత్రాలలో నటించాడు.

ఇందులో ఎక్కువ తమిళ్ చిత్రాల్లో నటించడం విశేషం.ఇక మలయాళం లో సైతం అప్పుడప్పుడు నటిస్తూ తన అదృష్టాన్ని వెతుక్కుంటున్నాడు.

ఇక 2022 సంవత్సరాని కి గాను టెన్త్ క్లాస్ డైరీస్, రావణాసుర అనే రెండు సినిమాలతో పాటు మహా, కాఫీ విత్ కాదల్ మరియు ఎచ్చో అనే తమిళ చిత్రాల్ నటిస్తున్నాడు.

ఈ ఐదు సినిమాలు ప్రస్తుతానికి షూటింగ్ దశలో ఉన్నాయ్.

కాల్వలో పారిన డిజీల్‌.. ఎగబడ్డ జనం.. వీడియో వైరల్