Sharwanand: ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్లి ఊసే ఎత్తట్లేని శర్వానంద్.. బయటపడ్డ అసలు నిజం?
TeluguStop.com
మామూలుగా సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు తమ పెళ్లిళ్ల విషయంలో బాగా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు.
కొందరైతే పెళ్లి చేసుకోకుండా కూడా ఉంటారు.ఇక కొంతమంది ఎంగేజ్మెంట్ చేసుకొని క్యాన్సిల్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.
ఇలా పెళ్లి విషయాలలో బాగా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు ఇండస్ట్రీకి చెందిన నటీనటులు.
అయితే జనవరిలో ఎంగేజ్మెంట్ చేసుకున్న శర్వానంద్( Sharwanand ) కూడా ఇప్పుడు సైలెంట్ అవ్వడంతో అందరిలో అనుమానాలు ఎదురవుతున్నాయి.
అయితే తాజాగా తన పెళ్లి గురించి టాపిక్ రాకపోవటానికి కారణం ఒకటి ఉందని తెలిసింది.
మరి అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. """/" /
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరో శర్వానంద్.
చిన్న హీరోగా అడుగుపెట్టి ఇప్పుడు తనకంటూ ఒక గుర్తింపుతో కొనసాగుతున్నాడు.నటనపరంగా మంచి మార్కులు సంపాదించుకొని తెలుగు ప్రేక్షకులతో మంచి అభిమానం సంపాదించుకున్నాడు.
చాలా వరకు మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలలో నటిస్తూ మంచి సక్సెస్ అందుకున్నాడు.
శర్వానంద్ 2003లో ఐదో తారీకు అనే సినిమాతో నటుడుగా పరిచయమయ్యాడు.ఆ తర్వాత శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ చేశాడు.
ఆ తర్వాత గౌరీ, సంక్రాంతి, వెన్నెల, లక్ష్మి వంటి సినిమాలలో కూడా తమ్ముడు క్యారెక్టర్లలో చేశాడు.
ఆ తర్వాత పలు సినిమాలలో హీరోగా నటించగా గమ్యం సినిమాతో(
Gamyam Movie ) మంచి గుర్తింపు అందుకున్నాడు.
"""/" /
ఆ తర్వాత కొన్ని సినిమాలు ప్లాప్ అయిన్నప్పటికీ కూడా అవకాశాలు మాత్రం తగ్గలేదు.
ఇక శతమానం భవతి, ఆడవాళ్లు మీకు జోహార్లు, ఎక్స్ప్రెస్ రాజా వంటి సినిమాలు కూడా మంచి సక్సెస్ అందించాయి.
ప్రస్తుతం ఆయన ఖాతాలో పలు సినిమాలు లైన్ లో ఉన్నాయి.ఇక శర్వానంద్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటాడు.
తనకు సంబంధించిన సినిమా అప్డేట్ లతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటాడు.
ఇక జనవరి లో రక్షిత రెడ్డి( Rakshita Reddy ) అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ కాగా త్వరలోనే పెళ్లి జరగనుందని అప్పట్లో తెలిపారు.
ఇక ఎంగేజ్మెంట్ అయి మూడు నెలలు దాటగా ఇంకా పెళ్లి ఊసే ఎత్తలేదు ఈ ఫ్యామిలీ.
చాలామందికి అనుమానం వచ్చి ఇంతకు పెళ్లి చేసుకుంటున్నారా లేదా అని ప్రశ్నలు కూడా వేస్తున్నారు.
"""/" /
అయితే సోషల్ మీడియాల ద్వారా వినిపిస్తున్న వార్త ఏంటంటే.ఈయన పెళ్లి కావడానికి ఇంకా కాస్త టైం ఉందని.
ప్రస్తుతం ఆయన పర్సనల్ హెల్త్ ప్రాబ్లం తో బాధపడుతున్నారు అని అందుకే ఆయన కొంతకాలం రెస్ట్ తీసుకుంటున్నాడని తెలిసింది.
ఇక ఆయన ఆరోగ్యం బాగా అయ్యేవరకు పెళ్లి చేసుకోడని తెలుస్తుంది.అంతేకాకుండా డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఫిక్స్ చేసిన సినిమాకు కూడా అనారోగ్యం కారణంగా గ్యాప్ ఇచ్చాడు అని తెలుస్తుంది.
అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.ప్రస్తుతం ఈ విషయం మాత్రం హాట్ టాపిక్ గా మారింది.
మరి దీని గురించి శర్వానంద్ ఏమని స్పందిస్తాడో చూడాలి.
ప్యాసింజర్ల మీద అరిచిన యూఎస్ ఎయిర్లైన్స్ సిబ్బంది.. క్షమాపణలు చెప్పిన కంపెనీ..