తెలుగు దేశం పార్టీ ప్రచార కార్యక్రమాలలో హీరో నిఖిల్.. ఫోటోలు వైరల్!

త్వరలోనే ఏపీలో ఎన్నికలు( AP Elections ) జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.

ఈ ప్రచార కార్యక్రమాలలో భాగంగా రాజకీయ నాయకులు మాత్రమే కాకుండా సినీ సెలబ్రిటీలకు కూడా రాజకీయ ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.

మరి కొద్ది రోజులలో ఎన్నికలు జరుగునున్న నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు.

అయితే తాజాగా హీరో నిఖిల్ ( Hero Nikhil )సైతం కూటమికి మద్దతుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు.

"""/"/ కొండ‌య్య గురువారం చీరాల ( Chirala ).అభ్య‌ర్థిగా నామినేష‌న్ దాఖ‌లు చేశారు.

అంత‌కుముందు ఆయ‌న చీరాల మండ‌ల ప‌రిధిలోని హస్తినాపురంలోని గ‌ణేశుడి ఆల‌యం నుంచి చీరాల వ‌ర‌కు భారీ ర్యాలీ నిర్వ‌హించ‌డం జ‌రిగింది.

ఈ ర్యాలీలో భాగంగా సినీ నటుడు నిఖిల్ పాల్గొన్నారు.సందర్భంగా గడియార స్తంభం కూడలిలో నిఖిల్‌ మాట్లాడుతూ.

చిరు నవ్వుల చీరాల కావాలంటే కొండయ్యకు( Kondaiah ) ఓటు వేసి గెలిపించాలని కోరారు.

అయితే ఈ పార్టీ ప్రచార కార్యక్రమాలలో భాగంగా నిఖిల్ రావడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఆయనతో ఫోటోలు దిగడం కోసం ఎగబడ్డారు.

"""/"/ ఇలా నిఖిల్ గతంలో తెలుగుదేశం పార్టీ( TDP )లోకి చేరారు అంటూ కూడా వార్తలు రాగా నిఖిల్ ఆ విషయం గురించి క్లారిటీ ఇచ్చారు.

అయితే నిఖిల్ ప్రచార కార్యక్రమాలలో పాల్గొనడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.అయితే ఈయన పార్టీ తరపున కాకుండా తన బంధువులు కావడంతోనే ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు.

నిఖిల్ సోదరిని మాలకొండయ్య యాదవ్ ( Mala Kondaiah Yadav ) పెద్ద కుమారుడు అమర్‌నాథ్‌కు ఇచ్చి వివాహం చేశారు.

అప్పటి నుంచి వీరిద్దరి మధ్య బంధుత్వం ఉంది.ఈ బంధుత్వం చూడు కారణంగానే నిఖిల్ ఎన్నికల ప్రచార ( Election Campaign ) కార్యక్రమాలలో పాల్గొన్నారని తెలుస్తుంది.

ఖడ్గమృగం కొమ్ముల్లో రేడియోయాక్టివ్ మెటీరియల్ ఇంజెక్టు చేసిన సైంటిస్టులు..??